నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం శమంతకమణి. ఈ చిత్ర అఫీసియల్ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ‘శమంతకమణి’ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
లేటెస్ట్ ట్రైలర్లో నారా రోహిత్, సుధీర్, సందీప్, ఆదిలతో పాటు రాజేంద్రప్రసాద్ పంచ్లతో ఫుల్ హంగామా చేస్తున్నారు. రెండు నిమిషాల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్లో యంగ్ హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. ‘శమంతకమణి’ కథ మొత్తం ఐదు కోట్లు విలువ చేసే ఓ కారు చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ని బట్టి తెలుస్తోంది. ఒక్క దెబ్బతో లైఫ్ సెటిల్ కావాలని ప్రయత్నించే నలుగురు యువకులకు ఈ శమంతకమణికి లింక్ ఏంటి? అనే కాన్సెప్ట్తో ఆసక్తిగా ట్రైలర్ను కట్ చేశారు.
‘మన కుర్రాళ్లందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో.. అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేవిగా ఉన్నాయి. శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
లేటెస్ట్ ట్రైలర్లో నారా రోహిత్, సుధీర్, సందీప్, ఆదిలతో పాటు రాజేంద్రప్రసాద్ పంచ్లతో ఫుల్ హంగామా చేస్తున్నారు. రెండు నిమిషాల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్లో యంగ్ హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. ‘శమంతకమణి’ కథ మొత్తం ఐదు కోట్లు విలువ చేసే ఓ కారు చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ని బట్టి తెలుస్తోంది. ఒక్క దెబ్బతో లైఫ్ సెటిల్ కావాలని ప్రయత్నించే నలుగురు యువకులకు ఈ శమంతకమణికి లింక్ ఏంటి? అనే కాన్సెప్ట్తో ఆసక్తిగా ట్రైలర్ను కట్ చేశారు.
‘మన కుర్రాళ్లందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో.. అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేవిగా ఉన్నాయి. శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.