జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్, మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఎ.కె.ఎస్ ఎంటర్టైనెంట్స్ బ్యానర్పై నిర్మాతలు అశ్విని కుమార్ సహదేవ్, గిరీష్ కపాడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "శరభ". రామోజీ ఫిలింసిటీలో పలు లోకేషన్స్లో షూటింగ్ పూర్తి చేసుకొందీ సినిమా. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అశ్విన్ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. "ఒక సరికొత్త కథాంశంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించబడుతున్న మా "శరభ" చిత్రం మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొంది. తాజా షెడ్యూల్లో విలన్ డెన్ సెట్లో క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ సైతం పూర్తి చేసాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు. ఈ సినిమాకి సాయమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించడం విశేషం.
పూర్తి కావచ్చిన 'శరభ' షూటింగ్!
జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్, మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఎ.కె.ఎస్ ఎంటర్టైనెంట్స్ బ్యానర్పై నిర్మాతలు
Samayam Telugu 18 Apr 2016, 5:29 pm