యాప్నగరం

శ్రియాతో నిహారిక.. కొత్త చిత్రానికి వరుణ్ క్లాప్!

‘కంచె’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ నిర్మాతగా మారారు.

Samayam Telugu 18 Jun 2018, 7:31 pm
‘కంచె’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తోన్న తొలి చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవంలో హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, టీఆర్ఎస్ నేత గొట్టుముక్కల పద్మారావు, నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, సాయిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటీమణి శ్రియాపై వరుణ్ తేజ్ తొలి క్లాప్ కొట్టగా.. తొలి షాట్‌కు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. పద్మారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Samayam Telugu HK8A14970058


See Photos: శ్రియ, నిహారిక కొత్త సినిమా లాంచ్

కాగా, ఈ చిత్రంలో శ్రియా శరణ్, నిహారిక కొణిదెల ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కమర్షియల్ అంశాలతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సుజన దర్శకత్వం వహిస్తున్నారు. జ్ఞాన శేఖర్ ఈ చిత్రాన్ని రమేష్ కరుతూరితో కలిసి సంయుక్తంగా క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్లలో నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.