యాప్నగరం

ప్రభాస్ సరసన.. అంతిస్తే ఓకే..!!

బాహుబలి వంటి అతి భారీ సినిమా లో నటించిన హీరోయిన్ కే అంత పారితోషకం ఇవ్వలేదు.

TNN 16 May 2017, 3:59 pm
బాహుబలి తర్వాత ప్రభాస్ చేయడానికి రెడీ అవుతున్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్లుగా అనేక మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కత్రినాకైఫ్ దగ్గర నుంచి ఆలియా భట్ వరకూ అనేక మంది పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరూ ఫైనలైజ్ కాలేదు. బాహుబలి వంటి సక్సెస్ ఫుల్ వెంచర్ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా కాబట్టి.. ఈ సినిమా అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో హీరోయిన్ ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
Samayam Telugu shraddha disha patani dropped from prabhass film after
ప్రభాస్ సరసన.. అంతిస్తే ఓకే..!!


ఇప్పటికే ‘సాహో’ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోందనే వార్తలు వస్తున్నాయి కూడా. మరి ఆ బడ్జెట్ కు తగిన స్థాయి రెమ్యూనరేషన్ నే అడుగుతున్నారట హీరోయిన్లు కూడా. ప్రభాస్ సరసన అనగనే.. వీరు రెమ్యూనరేషన్ ను భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయంలో ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు శ్రద్ధా కపూర్ మరొకరు దిశా పటానీ.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా సాగుతున్న శ్రద్ధ.. ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేయడానికి ఎనిమిది కోట్ల రూపాయలు అడిగిందట, ఇక పెద్దగా హిట్లేమీ లేదని దిశా కూడా ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని సమాచారం. మరి బాహుబలి వంటి అతి భారీ సినిమా లో నటించిన హీరోయిన్ కే అంత పారితోషకం ఇవ్వలేదు. కాబట్టి వేరే సినిమాలకు అంత ఇచ్చుకోలేరు కదా!

సాహో విషయంలోనూ అదే జరిగిందట. శ్రద్ధ అడిగినట్టుగా ఎనిమిది కోట్లు, దిశా అడిగినట్టు ఐదు కోట్లు ఇవ్వలేమని ఈ సినిమా యూనిట్ వీళ్లను కాదని వేరే హీరోయిన్ల వేటలో పడిపోయిందని టాక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.