యాప్నగరం

చిరంజీవి టైటిల్‌తో వస్తోన్న శ్రీకాంత్.. హీరోయిన్‌గా ‘పటాస్’ బ్యూటీ

సీనియర్ నటుడు శ్రీకాంత్ హీరోగా మరో చిత్రం వస్తోంది. వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ ఖరారైంది.

Samayam Telugu 27 Oct 2020, 6:07 pm
Samayam Telugu శ్రీకాంత్, శృతిశోది
Srikanth Marana Mrudangam
మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘మరణమృదంగం’ టైటిల్‌తో హీరో శ్రీకాంత్ వస్తున్నారు. హరిప్రియ మూవీస్ బ్యానర్‌పై, మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో డాక్టర్ కుంచపురమేష్ నిర్మాతగా వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరణమృదంగం’. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ను ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది.

‘‘మరణమృదంగం చిత్రంలో హీరో శ్రీకాంత్‌కు జోడీగా ‘పటాస్’ ఫేమ్ శృతిశోది ఖరారు అయ్యింది. శ్రీకాంత్ యాక్షన్ రివేంజ్ పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీ నవంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇదొక మంచి కథ, శ్రీకాంత్‌కు బాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాతో శ్రీకాంత్‌కు మంచి బ్రేక్ లభిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్లు దర్శకుడు వెంకటేష్ రెబ్బ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. మేము ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా మంచి టెక్నీషియన్స్‌తో తెరకెక్కిస్తున్నాం’’ అని అన్నారు.

సాంకేతిక నిపుణులు
నిర్మాత: డాక్టర్ కుంచపురమేష్
సహానిర్మాతలు: మధు రెబ్బ, కుంచపు అరుణ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
కెమెరామెన్: చిట్టిబాబు
ఫైట్స్: పి.సతీష్
సంగీతం: మంత్ర ఆనంద్
కథ, మాటలు: డి.తులసీ దాస్
దర్శకత్వం: వెంకటేష్ రెబ్బ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.