సౌత్ స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడిన స్టార్ హీరోయిన్ సిమ్రన్. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒక వెలుగు వెలిగింది ఈమె. విజయశాంతి తర్వాత.. సౌత్ లో నంబర్ వన్ అనిపించుకున్న హీరోయిన్ తను. అవకాశాలు మందగించాకా.. ఈమె పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సిమ్రన్.. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ నటిగా కెరీర్ ను కొనసాగించింది.
‘సూర్య సన్నాఫ్ కఈష్ణన్’లో నటించింది. బాలయ్యతో ‘ఒక్క మగాడు’లో కూడా నటించింది. ఆపై అడపాదడపా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది సిమ్రన్. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు లేడీ విలన్ గా అవతారం ఎత్తుతోందట ఈమె. ఈ విషయాన్ని సిమ్రన్ స్వయంగా ప్రకటించింది.
తమిళ యువహీరో శివకార్తికేయన్ సినిమాలో తనది నెగిటివ్ రోల్ అని, లేడీ విలన్ గా కనిపించబోతున్నాను అని ఆమె ప్రకటించింది. ఇక విక్రమ్ హీరోగా నటించిన ‘ధ్రవనక్షత్రం’లో కూడా సిమ్రన్ ఒక ముఖ్య పాత్ర చేసిందట. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
‘సూర్య సన్నాఫ్ కఈష్ణన్’లో నటించింది. బాలయ్యతో ‘ఒక్క మగాడు’లో కూడా నటించింది. ఆపై అడపాదడపా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది సిమ్రన్. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు లేడీ విలన్ గా అవతారం ఎత్తుతోందట ఈమె. ఈ విషయాన్ని సిమ్రన్ స్వయంగా ప్రకటించింది.
తమిళ యువహీరో శివకార్తికేయన్ సినిమాలో తనది నెగిటివ్ రోల్ అని, లేడీ విలన్ గా కనిపించబోతున్నాను అని ఆమె ప్రకటించింది. ఇక విక్రమ్ హీరోగా నటించిన ‘ధ్రవనక్షత్రం’లో కూడా సిమ్రన్ ఒక ముఖ్య పాత్ర చేసిందట. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.