యాప్నగరం

కనీసం బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా.. సింగర్ కౌసల్య పోస్ట్ వైరల్

Corona Effect: ఇటీవలే చిరంజీవి, శ్రీకాంత్ సహా పలువురు సినీ నటులకు కరోనా సోకి చికిత్స పొందుతుండగా.. తాజాగా ప్రముఖ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు.

Samayam Telugu 28 Jan 2022, 11:21 am
సినీ ఇండస్ట్రీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ వరకు పలువురు సినీ నటులు కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి వైరస్ కొంత మంది సినీ ప్రముఖులను మనకు దూరం చేసింది కూడా. ప్రస్తుతం కొనసాగుతున్న థర్డ్ వేవ్‌లో ఇటీవలే చిరంజీవి, శ్రీకాంత్ సహా పలువురు సినీ నటులకు కరోనా సోకి చికిత్స పొందుతుండగా.. తాజాగా ప్రముఖ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన తాజా పరిస్థితిని తెలిపారు.
Samayam Telugu కనీసం బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా: సింగర్ కౌసల్య
Kousalya

పబ్‌లో హీరోయిన్‌తో ఆర్జీవీ! ఆ వీడియోలతో మరోసారి చర్చల్లో నిలిచిన కాంట్రవర్సీ కింగ్
''కరోనా పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. నాలో ఈ వైరస్ ల‌క్ష‌ణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ప్రస్తుతం క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నాను. గొంతు నొప్పి మరింత ఇబ్బంది పెడుతోంది. నిన్న‌టి నుంచి మందులు తీసుకోవడం మొద‌లు పెట్టాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి'' అని పేర్కొంది కౌసల్య. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Kousalya Potturi (@singerkousalya)

థర్డ్ వేవ్‌లో కరోనా వైరస్ వీరవిహారం చేప్తోంది. ప్రస్తుతం దేశం మెత్తం మీద 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.