యాప్నగరం

నాలాంటి వారందరినీ భాగస్వామ్వం చేస్తున్నందుకు ధన్యవాదాలు: సింగర్ మధుప్రియ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి ప్రోత్సాహం కొనసాగుతోంది. ఈ మూడో విడత మొక్కలు నాటే కార్యక్రమంలోనూ టాలీవుడ్ సెలబ్రిటీలు పాలు పంచుకుంటున్నారు.

Samayam Telugu 18 Jun 2020, 5:29 pm
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఈ కార్యక్రమానికి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, యాంకర్లు, సింగర్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ శివజ్యోతి ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్‌ను పూర్తిచేశారు. ఇప్పుడు మరో కంటెస్టెంట్, సింగర్ మధుప్రియ ఈ ఛాలెంజ్‌ను పూర్తిచేశారు.
Samayam Telugu మధుప్రియ
Singer Madhu Priya


Also Read: అల్లు శిరీష్‌కు విశ్వక్ సేన్ ఛాలెంజ్.. మీ వంతు చేయండి!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి గాయని మధుప్రియ గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో మూడు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మధుప్రియ మాట్లాడుతూ.. ‘‘ఎంపీ సంతోషన్న చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ అందులో నాలాంటి వారందరిని భాగస్వామ్యం చేస్తున్నందుకు సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలను పోస్ట్ చేశారు.

Also Read: ముగ్గురు బిగ్ బాస్ బ్యూటీలకు శివజ్యోతి ఛాలెంజ్

మొక్కల్ని నాటడం, అలాగే నాటిన ప్రతి మొక్కనీ కాపాడుదాం అనే నినాదంతో సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని మధుప్రియ ఆకాక్షించారు. ఈ సందర్భంగా మధుప్రియ, కార్పోరేటర్ గోపు సరస్వతి మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ నుంచి మొదటి మహిళ పైలట్ అయిన సంజన, జీహెచ్ఎంసీ ఉప్పల్ కమిషనర్ అరుణ కుమారి, నటుడు మధునందన్‌లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు.
View this post on Instagram Proud to be a part of Green Challenge India❤️ ఎంపీ సంతోష్ అన్న నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 లో భాగంగా ఈ రోజు ఉప్పల్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.మానవాళికి ప్రాణవాయు అందించే చెట్లను నాటి వాటిని నిరంతరం సంరక్షించాలనే సంకల్పంతో సంతోషన్న చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సంతోషన్న కు ధన్యవాదాలు. #greenindiachallenge @santoshkumarjoginipally #madhupriya A post shared by Madhupriya (@madhupriya_peddinti) on Jun 18, 2020 at 2:50am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.