బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజా పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం మే 8న ముంబైలో జరగనుంది. అయితే పెళ్లికి ముందు జరిగే మెహందీ వేడుక ఆదివారం అనిల్ కపూర్ నివాసం జుహు బంగ్లాలో సందడిగా జరిగింది. ఈ వేడుకకు అనిల్ కపూర్, బోనీ కపూర్ కుటుంబసభ్యులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఆదివారం ఉదయం ముంబైకు చేరుకున్న ఆనంద్ అహుజాను సోనమ్ కపూర్ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు.
కాగా, మెహందీ వేడుకలో తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కేవలం కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మాత్రమే పాల్గొన్న ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను వారే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. జాన్వి కపూర్, ఖుషీ కపూర్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్, రాణి ముఖర్జీ, సిద్ధార్థ్ కపూర్ తదితరులు సోనమ్ మెహందీ వేడుకలో సందడి చేశారు. ఆ ఫొటోలు మీకోసం..
సందడిగా సోనమ్ కపూర్ మెహందీ వేడుక
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజా పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu 6 May 2018, 11:13 pm