సీనియర్ డైరెక్టర్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం పర్యవేక్షణలో‘పెళ్లి సందD’ సినిమా రూపొందతున్న సంగతి తెలిసిందే. గత 25 ఏళ్ల క్రింద ఇదే ‘పెళ్లి సందడి’ పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన ఆయన.. ఇప్పుడు మోడ్రన్ ‘పెళ్లి సందD’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి మాత్రం సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడం లేదు. గౌరీ రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పాత సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్గా చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ను సూపర్స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. రాఘవేంద్ర రావు స్టైల్లోనే ఈ సినిమాను గౌరి రోనంకి తెరకెక్కించారు అని ఈ ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఇక ట్రైలర్లో రోషన్, శ్రీలీల మధ్య రొమాన్స్, ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి అందించిన మ్యూజిక్ హైలైట్గా నిలిచాయి. అయితే తాజాగా ఈ సినిమాకు మరో స్టార్ హీరో నుంచి మద్దతు లభించింది.
ఈ సినిమా నుంచి ‘మధురా నగరిలో’ అనే పాటను మాస్ మహరాజ రవితేజ బుధవారం విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్లో హీరోహీరోయిన్లు ఒకరినొకరు హత్తుకొని మంచి రొమాంటిక్ పోజ్లో ఉన్నారు. ఈ పోస్టరే ఇంత రొమాంటిక్గా ఉంటే పాట ఇంకెత రొమాంటిక్గా ఉంటుందో అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ పాట విడుదల కానుంది. ఆర్కే ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్పై కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ను సూపర్స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. రాఘవేంద్ర రావు స్టైల్లోనే ఈ సినిమాను గౌరి రోనంకి తెరకెక్కించారు అని ఈ ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఇక ట్రైలర్లో రోషన్, శ్రీలీల మధ్య రొమాన్స్, ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి అందించిన మ్యూజిక్ హైలైట్గా నిలిచాయి. అయితే తాజాగా ఈ సినిమాకు మరో స్టార్ హీరో నుంచి మద్దతు లభించింది.
ఈ సినిమా నుంచి ‘మధురా నగరిలో’ అనే పాటను మాస్ మహరాజ రవితేజ బుధవారం విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్లో హీరోహీరోయిన్లు ఒకరినొకరు హత్తుకొని మంచి రొమాంటిక్ పోజ్లో ఉన్నారు. ఈ పోస్టరే ఇంత రొమాంటిక్గా ఉంటే పాట ఇంకెత రొమాంటిక్గా ఉంటుందో అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ పాట విడుదల కానుంది. ఆర్కే ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్పై కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.