యాప్నగరం

రేపట్నుంచి బొమ్మ పడుద్ది.. థియేటర్స్ బంద్ విరమణ

ఎట్టకేలకు సుదీర్ఘ చర్చల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి.

Samayam Telugu 7 Mar 2018, 10:36 pm
ఎట్టకేలకు సుదీర్ఘ చర్చల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. తెలుగు సినీ నిర్మాతల మండలి, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల మధ్య రాజీ కుదరడంతో గురువారం నుండి అన్ని ఏరియాలలో యాదావిధిగా ఆటలు ప్రదర్శితం కానున్నాయి. డిజిటల్ ప్రొవైడర్స్ వసూలు చేస్తున్న ఛార్జీలకు నిరసనగా ఐదు రాష్ట్రాల చిత్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి మార్చి 2 న బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వారం రోజుల నుండి ఇటు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో థియేటర్స్ మూత పడ్డాయి. ఈ చర్చల అనంతరం ఏప్రిల్ 6 నుండి కొత్త రేట్స్ అమలులోకి వస్తాయని ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గత వారం రోజులుగా సుమారు 1700 థియేటర్స్ మూత పడటంతో భారీగాను ఆదాయాన్ని కోల్పోయారు థియేటర్ యాజమాన్యాలు. మరోవైపు సినిమా లవర్స్ పై ఈ బంద్ ప్రభావం ఉండటంతో తాజా నిర్ణయం వారికి ఊరటనిచ్చింది.
Samayam Telugu థియేటర్స్ బంద్ విరమణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.