2013లో ‘రాజా రాణి’ సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు అట్లీ (Atlee). ఆర్య, నయనతార, జై, నజ్రియా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని రూపొందించిన అట్లీ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. దీంతో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay)తో సినిమా చేసే చాన్స్ కొట్టేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తేరి’ మూవీ 2016లో విడుదల కాగా.. ఆ తర్వాత విజయ్తో మరో రెండు సినిమాలు చేశాడు అట్లీ. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)తో జవాన్(Jawan) మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ అట్లీ చేసిన ట్వీట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘దేవుడి ఆశీస్సులతో మేము ఈ ఏడాది రెండు రిలీజ్లు పొందబోతున్నాం. ఫిబ్రవరిలో మొదటి రిలీజ్(ఫస్ట్ చైల్డ్) ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జూన్ 2వ తేదీన సెకండ్ రిలీజ్(జవాన్ మూవీ) ఉంటుందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది.
డైరెక్టర్ అట్లీ.. ప్రియా మోహన్ను 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కాగా.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఈ జంట గత ఏడాది డిసెంబర్లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో షేర్ చేసుకున్నారు. ‘ఈ విషయాన్ని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ కావాలి. ప్రేమతో అట్లీ, ప్రియ’ అని సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలను గెలుచుకోగా.. ఇన్స్టాలో ఐదు లక్షల మంది యూజర్లు లైక్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో ‘జవాన్’ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్పై అటు సౌత్, ఇటు నార్త్లో భారీ అంచనాలున్నాయి. కింగ్ ఖాన్ షారుఖ్ను డైరెక్టర్ అట్లీ మాస్ క్యారెక్టర్లో పవర్ఫుల్గా చూపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ‘జవాన్’ మూవీ జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిమేల్ లీడ్గా నటిస్తున్న చిత్రంలో సౌత్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక కెరీర్ విషయానికొస్తే.. విజయ్తో అట్లీకి మంచి అండర్స్టాండింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘తేరి, మెర్సల్, బిగిల్’ సినిమాలే అందుకు ఉదాహరణం. అంతేకాదు ప్రస్తుతం విజయ్ నటించిన ‘వారిసు’ సంక్రాంతికి రిలీజ్ కాబోతుండగా.. లోకేష్ కనగరాజ్తో అతని నెక్ట్స్ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ అట్లీతోనే సినిమాకు చేయనున్నాడు విజయ్.
డైరెక్టర్ అట్లీ.. ప్రియా మోహన్ను 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కాగా.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఈ జంట గత ఏడాది డిసెంబర్లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో షేర్ చేసుకున్నారు. ‘ఈ విషయాన్ని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ కావాలి. ప్రేమతో అట్లీ, ప్రియ’ అని సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలను గెలుచుకోగా.. ఇన్స్టాలో ఐదు లక్షల మంది యూజర్లు లైక్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో ‘జవాన్’ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్పై అటు సౌత్, ఇటు నార్త్లో భారీ అంచనాలున్నాయి. కింగ్ ఖాన్ షారుఖ్ను డైరెక్టర్ అట్లీ మాస్ క్యారెక్టర్లో పవర్ఫుల్గా చూపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ‘జవాన్’ మూవీ జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిమేల్ లీడ్గా నటిస్తున్న చిత్రంలో సౌత్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక కెరీర్ విషయానికొస్తే.. విజయ్తో అట్లీకి మంచి అండర్స్టాండింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘తేరి, మెర్సల్, బిగిల్’ సినిమాలే అందుకు ఉదాహరణం. అంతేకాదు ప్రస్తుతం విజయ్ నటించిన ‘వారిసు’ సంక్రాంతికి రిలీజ్ కాబోతుండగా.. లోకేష్ కనగరాజ్తో అతని నెక్ట్స్ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ అట్లీతోనే సినిమాకు చేయనున్నాడు విజయ్.
- Read Latest Tollywood Updates and Telugu news