రజినీ కూతురు విడాకులు తీసుకుంటుందా?
సినిమాల్లోని ట్విస్టుల లాగే ఈ సినిమా వాళ్ల పెళ్లి జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఎవరికీ అర్థం కావు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు విడాకులు తీసుకోబోతోందని కోలీవుడ్ కోడై కూస్తుంది...
TNN 16 Sep 2016, 5:02 pm
సినిమాల్లోని ట్విస్టుల లాగే ఈ సినిమా వాళ్ల పెళ్లి జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఎవరికీ అర్థం కావు. ముఖ్యంగా తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ కాపురాల కూలడాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఇటీవలే అమలాపాల్- ఏల్ విజయ్ జంట విడాకులు కోసం కోర్టుకెక్కగా మరో రెండు జంటల వైవాహిక జీవితం క్లైమాక్సుకు వచ్చి డివోర్స్ కు సిద్ధంగా ఉన్నాయట. సంచలన విషయం ఏంటంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు విడాకులు తీసుకోబోతోందని కోలీవుడ్ కోడై కూస్తుంది. రజినీకాంత్ చిన్నకూతురు సౌందర్య 2010లో అశ్విన్ రాంకుమార్ అనే ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారిని పెళ్లి చేసుకొంది. వీరికి ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. అయితే గతకొంత కాలం నుంచి వీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం లేదంట. వీరిద్దరూ గతకొంత కాలంగా వేర్వేరుగానే నివసిస్తున్నట్లు తెలుస్తుంది. తన కాపురంలో కల్లోలం కారణంగానే ఇటీవల యూఎస్ పర్యటనకు వెళ్లిన రజినీకి తోడుగా సౌందర్య వెళ్లలేదంట. అపుడు పెద్దకూతురు ఐశ్వర్య ధనుష్ మాత్రమే వెళ్లింది. రజినీకాంత్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు సౌందర్య- అశ్విన్ జంట విడాకుల కోసం కుటుంబ కోర్టులో పిటిషన్ వేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే వీరిద్దరి కుటుంబాలు విడాకులు తీసుకోనివ్వకుండా ఆపుతున్నట్లు సమాచారం. మరి చూడాలి వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది.
ఇదిలా ఉండగా మరో సినీ జంట తమిళ నటుడు బాబీ సింహా, నటి రేశ్మి మీనన్ ల వివాహం గత ఏప్రిల్ నెలలోనే జరిగింది. అయితే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకుంటున్నారంటూ 'కే టౌన్'లో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత బాబీ నటించిన ఏ సినిమా సరిగా ఆడలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, పెళ్లి కలిసి రాలేదని భావించిన ఈ కొత్త జంట విడాకులు తీసుకోబోతోందటూ జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ' టైమ్స్ ఆఫ్ ఇండియా' బాబీ సింహాను ప్రశ్నించగా ఆయన పెద్దగా నవ్వుతూ..' హే ఏంటి ఇదంతా..? అలాంటిది ఏమి లేదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి పుకార్లు ఎవరు ఎందుకు సృష్టిస్తారో అర్థం అవ్వటం లేదు రొంబ కామెడీ ఇరుక్కు' అన్నారు.
ఇదిలా ఉండగా మరో సినీ జంట తమిళ నటుడు బాబీ సింహా, నటి రేశ్మి మీనన్ ల వివాహం గత ఏప్రిల్ నెలలోనే జరిగింది. అయితే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకుంటున్నారంటూ 'కే టౌన్'లో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత బాబీ నటించిన ఏ సినిమా సరిగా ఆడలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, పెళ్లి కలిసి రాలేదని భావించిన ఈ కొత్త జంట విడాకులు తీసుకోబోతోందటూ జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ' టైమ్స్ ఆఫ్ ఇండియా' బాబీ సింహాను ప్రశ్నించగా ఆయన పెద్దగా నవ్వుతూ..' హే ఏంటి ఇదంతా..? అలాంటిది ఏమి లేదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి పుకార్లు ఎవరు ఎందుకు సృష్టిస్తారో అర్థం అవ్వటం లేదు రొంబ కామెడీ ఇరుక్కు' అన్నారు.