సినిమా హిట్ కావాలంటే భారీ బడ్జెట్ చిత్రాలే కానక్కర్లేదు. తక్కువ బడ్జెట్తోనే తీసినా.. చక్కటి కథ, కథనం ఉంటే చాలని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘నాదీ నీదీ ఒకే కథ’ కూడా మరోసారి ఇదే విషయాన్ని రుజువు చేసింది. ఉడుగుల వేణు దర్శకత్వం వచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లోనే లాభాల్లోకి రావడమే దీనికి నిదర్శనం. నిర్మాణం, ప్రచారం తదితర ఖర్చులు కలిపి ఈ సినిమా కోసం నిర్మాతలు రూ. 2.25 కోట్లు ఖర్చు చేశారు.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో తొలి వీకెండ్లోనే రూ.1.90 కోట్లు వసూలు చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో కలెక్షన్ల పరంగా బెస్ట్గా నిలిచింది. హిందీ డబ్బింగ్ రూపంలో రూ.40 లక్షలు రావడంతో నిర్మాతలు లాభాల్లోకి వెళ్లారు. శాటిలైట్ రైట్స్ను కూడా విక్రయిస్తే.. మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది.
సినిమా బాగుందనే టాక్ రావడం, థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగడంతో మరో 70 థియేటర్లు పెంచినట్లు సమాచారం. దీంతో రంగస్థలం విడుదల కావడానికి ముందే ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో తొలి వీకెండ్లోనే రూ.1.90 కోట్లు వసూలు చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో కలెక్షన్ల పరంగా బెస్ట్గా నిలిచింది. హిందీ డబ్బింగ్ రూపంలో రూ.40 లక్షలు రావడంతో నిర్మాతలు లాభాల్లోకి వెళ్లారు. శాటిలైట్ రైట్స్ను కూడా విక్రయిస్తే.. మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది.
సినిమా బాగుందనే టాక్ రావడం, థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగడంతో మరో 70 థియేటర్లు పెంచినట్లు సమాచారం. దీంతో రంగస్థలం విడుదల కావడానికి ముందే ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.