యాప్నగరం

శ్రీదేవి మరణవార్త విని.. ఇండియాలో ఒంటరిగా.. తల్లడిల్లిన కూతురు

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్ దేశాన్ని కలచివేసింది. దుబాయ్‌లో ఆమె మరణించగా.. ఇండియాలో ఆమె కూతురు ఒంటరిగా తల్లడిల్లింది.

TNN 25 Feb 2018, 11:16 am
అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టింది. సినీ రంగంతోపాటు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వివాహ వేడుకలో పాల్గొనడం కోసం దుబాయ్ వెళ్లిన ఆమె అక్కడే గుండె పోటుతో మరణించారు. శ్రీదేవి మరణించిన సమయలో భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ ఆమె పక్కనే ఉన్నారు.
Samayam Telugu sri devis elder daughter jhanvi kapoor in india while she was died
శ్రీదేవి మరణవార్త విని.. ఇండియాలో ఒంటరిగా.. తల్లడిల్లిన కూతురు


బంధువుల పెళ్లి కోసం కుటుంబం మొత్తం దుబాయ్ వెళ్లగా పెద్ద కుమార్తె జాన్వి మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ జాన్వీ కపూర్‌‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. దడక్ అనే సినిమాతో జాన్వీ హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కోసమే ఆమె దుబాయ్ వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోయింది.

తల్లి మరణ వార్త వినడంతో జాన్వీ తల్లడిల్లిపోయింది. అమ్మ ఇకలేదని తెలిసి.. షాకయ్యింది. కూతుర్ని హీరోయిన్‌గా చూడాలన్న కోరిక తీరకుండానే అందాల నటి లోకాన్ని వీడటం అందర్నీ కలచివేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.