సినీ ప్రముఖుల సమక్షంలో శ్రీదేవి సంతాప సభ: తలసాని
ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్లో శనివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మిక మృతిచెందిన విషయం తెలిసిందే.
TNN 25 Feb 2018, 7:58 pm
ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్లో శనివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మిక మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీదేవి మృతి చిత్ర పరిశ్రమకే కాకుండా ఆమె అభిమానులకు తీరని లోటని అన్నారు. త్వరలో చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో సంతాప సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి, అనంతరం కథానాయికగా అలనాటి అగ్ర నటులతో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు లాంటి సీనియర్ నటులే కాదు నాటి కుర్ర హీరోలతోనూ అనేక చిత్రాలలో నటించి, తన నటనతో అభిమానులను మెప్పించారని ప్రశంసలు కురిపించారు.
తెలుగు, తమిళ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. దేశం మొత్తం మీద అభిమానులను సంపాదించుకున్నారని తలసాని అన్నారు. తన నటనకు గాను 2013లో పద్మశ్రీ అవార్డు, నంది అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులను ఆమె అందుకున్నారని తెలిపారు.
మరోవైపు నటి శ్రీదేవి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. ఆమె మృతికి సంతాపం తెలిపిన ఆయన, తమ బ్యానర్లో కృష్ణతో తీసిన మొదటి సినిమాలో శ్రీదేవి కథానాయికగా నటించారని తెలిపారు. 'మకుటం లేని మహారాణి'గా శ్రీదేవి చిత్ర పరిశ్రమలో వెలిగారని అన్నారు. శ్రీదేవి కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని బీవీఎస్ఎన్ ప్రసాద్ గుర్తుచేసుకున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. దేశం మొత్తం మీద అభిమానులను సంపాదించుకున్నారని తలసాని అన్నారు. తన నటనకు గాను 2013లో పద్మశ్రీ అవార్డు, నంది అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులను ఆమె అందుకున్నారని తెలిపారు.
మరోవైపు నటి శ్రీదేవి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. ఆమె మృతికి సంతాపం తెలిపిన ఆయన, తమ బ్యానర్లో కృష్ణతో తీసిన మొదటి సినిమాలో శ్రీదేవి కథానాయికగా నటించారని తెలిపారు. 'మకుటం లేని మహారాణి'గా శ్రీదేవి చిత్ర పరిశ్రమలో వెలిగారని అన్నారు. శ్రీదేవి కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని బీవీఎస్ఎన్ ప్రసాద్ గుర్తుచేసుకున్నారు.