యాప్నగరం

శ్రీదేవి ఫ్యామిలీతో బంధుత్వం.. అంబానీ జెట్ పంపింది అందుకే!

శ్రీదేవి పార్థీవ దేహాన్ని దుబాయ్ నుంచి ముంబై తీసుకురావడం కోసం అనిల్ అంబానీ తన ప్రయివేట్ జెట్‌ను పంపడానికి బహుశా ఈ బంధుత్వమే కారణం కావచ్చు.

TNN 28 Feb 2018, 11:26 am
బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే హోటల్ గదిలో ప్రాణాలు వదిలారు. శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు తలెత్తినప్పటికీ.. చివరకు ఆమె బాత్‌టబ్‌లో పడిపోయి, స్పృహ కోల్పోవడం వల్లే చనిపోయారని దుబాయ్ అధికారులు తేల్చారు. శనివారం రాత్రి ఆమె మరణించగా.. మంగళవారం రాత్రి ఆమె భౌతిక కాయాన్ని ప్రయివేట్ జెట్‌లో ముంబై తీసుకొచ్చారు. 13 మంది కూర్చోగల సామర్థ్యం ఉన్న ఈ జెట్‌ను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సమకూర్చారు.
Samayam Telugu sridevis demise anil ambani sent a chartered plane this is probably why
శ్రీదేవి ఫ్యామిలీతో బంధుత్వం.. అంబానీ జెట్ పంపింది అందుకే!


శ్రీదేవి భౌతికకాయం తరలింపు కోసం అనిల్ అంబానీ తన జెట్‌ను సమకూర్చడానికి ముఖ్య కారణం ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటమే. బోనీ కపూర్ మేనల్లుడు మోహిత్ మర్వా పెళ్లి వేడుకల్లో పాల్గొనడం కోసం శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

బోనీ కపూర్ సోదరి రీనా మార్వా కుమారుడైన మోహిత్.. అంతరా మోతివాలాను పెళ్లాడారు. అంతర.. అనిల్ అంబానీ భార్య టీనాకు స్వయానా అక్క కూతురు. వీరి పెళ్లితో అంబానీలకు బోనీ కపూర్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధం ఏర్పడింది. శ్రీదేవి పార్థీవ దేహాన్ని దుబాయ్ నుంచి ముంబై తీసుకు రావడానికి అనిల్ అంబానీ తన జెట్‌ను సమకూర్చడానికి ఇది కూడా ఓ కారణమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.