యాప్నగరం

నటుడు కేకే శర్మ ఇక లేరు

రంగస్థల నటుడు, తెలుగు సినీనటుడు కేకే శర్మ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న..

Samayam Telugu 7 Dec 2022, 10:51 am
రంగస్థల నటుడు, తెలుగు సినీనటుడు కేకే శర్మ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేకే శర్మ గురువారం ఉదయం 10 గంటలకి తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. 1969లో రిలీజైన మాయని మమత సినిమాతో తొలిసారిగా సినీనటుడిగా మారిన కేకే శర్మ అంతకన్నా ముందుగా రంగస్థల నటుడిగా అనేక నాటకాలలో నటించారు. సినిమాల్లో అత్యధికంగా కమెడియన్ పాత్రలు చేసిన శర్మ.. బాల నాగమ్మకి పేరడీగా 'గోల నాగమ్మ' అనే సినిమాను సైతం నిర్మించారు.
Samayam Telugu KK Sharma
కె.కె.శర్మ


ఏడిద నాగేశ్వర రావు, హరనాథ్, విజయ్ చందర్, వీబీ రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులతో కలిసి అనేక నాటకాలు వేశారు శర్మ. గురు ప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గురించి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చిన బృందంలో శర్మ శాశ్వత సభ్యునిగా వుండేవారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.