యాప్నగరం

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్టార్ డైరెక్టర్‌

తమిళ్‌లో నాన్‌ మహాన్‌ అల్లా, రాజా పట్టాయ్‌, జీవా, పాయంపులి లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుశీంద్రన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం వాకింగ్ చేసేందుకు రోడ్డు మీదకు వెళ్లిన సుశీంద్రన్‌ను ఓ ద్విచక్రవాహనం ఢీ కొట్టింది.

Samayam Telugu 25 Jan 2020, 2:07 pm
ఒక్కోసారి ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. సాధారణ వ్యక్తుల విషయంలోనే కాదు ఒకసారి సెలబ్రిటీ విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ ప్రముఖ దర్శకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉదయం వాకింగ్ చేద్దామని రోడ్డు మీదకు వెళ్లిన ఓ స్టార్‌ డైరెక్టర్ రోడ్లు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు.
Samayam Telugu Suseenthiran
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుశీంద్రన్‌


ఇక అసలు విషయానికి వస్తే తమిళ్‌లో నాన్‌ మహాన్‌ అల్లా, రాజా పట్టాయ్‌, జీవా, పాయంపులి లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుశీంద్రన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం వాకింగ్ చేసేందుకు రోడ్డు మీదకు వెళ్లిన సుశీంద్రన్‌ను ఓ ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయి విరింగింది. గాయాలు తీవ్రంగా కావటంతో ఆయన్ను కొద్ది రోజులు అబ్జర్వేషన్‌ ఉండాలని వైధ్యులు సూచించారు.
Also Read: అఖిల్‌తో మెగా డైరెక్టర్‌.. అంతా ఉత్తిదే!

ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది కెనడీ క్లబ్‌, ఛాంపియన్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాదించాయి. దర్శకుడిగానే కాక నామ్‌, దీపావళి, సుట్టు పిడిక్క ఉత్తరవు సినిమాల్లో నటుడిగానూ ఆకట్టుకున్నాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు శివ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించింది.
Also Read: మళ్లీ తల్లైన హీరోయిన్‌.. ఏంజెల్‌ వచ్చేసింది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.