యాప్నగరం

హరికృష్ణ మృతి.. మీడియాకు మంచు మనోజ్ విజ్ఞప్తి

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాద దృశ్యాలను ప్రసారం చేయడాన్ని మీడియా దయచేసి ఆపివేయాలని సినీ నటుడు మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.

Samayam Telugu 29 Aug 2018, 12:05 pm
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాద దృశ్యాలను ప్రసారం చేయడాన్ని మీడియా దయచేసి ఆపివేయాలని సినీ నటుడు మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. ‘ఊహించని విధంగా ఈ ప్రమాదంలో తమ ఆత్మీయుడిని కోల్పోయిన అనుచరులు, కుటుంబ సభ్యులకు మీడియాలో వచ్చే దృశ్యాలు మరింత బాధను కలుగజేస్తాయి. ఆయన మనందరి మనిషి. దయచేసి ఆయన్ని గౌరవిద్దాం. నా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నా. ధన్యవాదాలు’ అని మనోజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu Hari-Krishna1

మనో ట్వీట్‌కు నందమూరి అభిమానులు స్పందిస్తున్నారు. హరికృష్ణ ఆకస్మిక మృతి తమను తీవ్రంగా కలచివేస్తోందని, టీవీల్లో చూపించే దృశ్యాలు మరింత క్షోభకు గురిచేస్తున్నాయని మనోజ్ ట్వీట్‌కు రిప్లైలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రమాద వీడియోలు షేర్ చేయడం ఆపాలని మరికొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు.

కాగా, నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను వెంటనే నార్కెట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. ఛాతికి స్టీరింగ్ బలంగా ఢీకొనడంతోపాటు.. తలకు తీవ్రంగా గాయం కావడంతో రక్తస్రావమైంది. దీంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ.. ఆయన్ను కాపాడలేకపోయారు. ఉదయం 7.30 గంటలకు ఆయన మరణించారని డాక్టర్లు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.