యాప్నగరం

వారెవ్వా బన్నీ.. క్రేజ్‌తో షేక్ చేస్తున్నాడుగా!

అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు.

TNN 20 Nov 2017, 9:11 pm
అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు. సోషల్ మీడియాలో బన్నీకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఖాతాల్లో లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇన్‌స్ట‌ాగ్రామ్‌ లోకి కూడా ఎంటర్ అయిపోయాడు. ఇంకా అందులో ఆయన ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు జస్ట్ అకౌంట్ ఓపెన్ చేశాదంతే.. ఇంతలోనే అతడి ఫాలోవర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. ఇన్‌స్ట‌ాగ్రామ్‌‌తో తన జర్నీ 21వ తారీఖు నుండి మొదలవుతుందని ఒక మెమొరబుల్ ఫోటోను ఆరోజు ఇన్‌స్ట‌ాగ్రామ్‌‌లో పోస్ట్ చేస్తానని బన్నీ వెల్లడించాడు.
Samayam Telugu stylish star allu arjun to begin his instagram journey with a memorable picture
వారెవ్వా బన్నీ.. క్రేజ్‌తో షేక్ చేస్తున్నాడుగా!


దీంతో ఆయన ఎలాంటి ఫోటో షేర్ చేయబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది. ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ 'నా పేరు సూర్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో బన్నీకు విలన్‌గా అనూప్ సింగ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.