యాప్నగరం

Jawan Condolences: ఉగ్రదాడిపై మహేష్ బాబు భావోద్వేగ స్పందన

దేశరక్షణలో వీరమరణం పొందిన జవాన్లకు దేశ వ్యాప్తంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు భారతీయులు. ఈ దాడిని ఖండిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఈ ఉగ్రదాడి ఖండిస్తూ ట్వీట్ చేశారు.

Samayam Telugu 15 Feb 2019, 5:14 pm
ఉగ్రదాడిలో జవాన్లు మృతిచెందడంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల సంఖ్య 49కి చేరింది. ముష్కరమూకల దాడిలో తీవ్రంగా గాయపడి.. శ్రీనగర్ బాదామిబాగ్‌లోని 92వ బేస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. మరికొంత మంది సైనికులు ప్రాణాలతో పోరాడుతున్నారు. దేశరక్షణలో వీరమరణం పొందిన జవాన్లకు దేశ వ్యాప్తంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు భారతీయులు. ఈ దాడిని ఖండిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
Samayam Telugu మహేష్ బాబు


Read Also: మీ త్యాగాలు ఊరికేపోవు.. ఉగ్రదాడిపై టాలీవుడ్ స్టార్లు

టాలీవుడ్ నుండి అల్లు అర్జున్, రానా, మంచు మనోజ్, నాని సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క తదితరులు స్పందించగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఉగ్రదాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఇది చాలా బాధాకరం.. పుల్వామా జిల్లాలో జరిగిన టెర్రర్ ఎటాక్‌‌ దారుణం. జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ జవాన్ల కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.