యాప్నగరం

SSMB 28 : త్రివిక్రమ్ సినిమా కోసం రంగంలోకి మహేష్.. ఎన్టీఆర్ ట్రైనర్ పోస్ట్ వైర‌ల్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ (Super Star Mahesh) త‌న నెక్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీ అయ్యారు. గ‌త కొన్నాళ్లుగా మ‌హేష్ ఫ్యామిలీ (Mahesh Family)తో క‌లిసి వెకేష‌న్ మోడ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కుటుంబంతో క‌లిసి టూర్ పూర్తి చేసుకుని త‌న పుట్టిన‌రోజు ముందుగానే హైద‌రాబాద్ చేరుకున్న మ‌హేష్ అండ్ ఫ్యామిలీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ను జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. అన్నీ ఈవెంట్స్ పూర్త‌య్యాయి. ఇప్పుడు మ‌హేష్ .. త‌న 28వ సినిమాను షురూ చేశారు.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 16 Aug 2022, 9:28 pm
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ (Super Star Mahesh) త‌న నెక్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీ అయ్యారు. గ‌త కొన్నాళ్లుగా మ‌హేష్ ఫ్యామిలీ (Mahesh Family)తో క‌లిసి వెకేష‌న్ మోడ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కుటుంబంతో క‌లిసి టూర్ పూర్తి చేసుకుని త‌న పుట్టిన‌రోజు ముందుగానే హైద‌రాబాద్ చేరుకున్న మ‌హేష్ అండ్ ఫ్యామిలీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ను జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. అన్నీ ఈవెంట్స్ పూర్త‌య్యాయి. ఇప్పుడు మ‌హేష్ .. త‌న 28వ సినిమాను షురూ చేశారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. దీని కోసం మ‌హేష్ త‌న లుక్‌ను మార్చుకుంటున్నారు. కాస్త మీసాలు.. గ‌డ్డం పెంచి స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు.
Samayam Telugu Mahesh Babu
మహేష్ బాబు


లుక్‌తోపాటు ఫిజిక్ ప‌రంగానూ మ‌హేష్ కొత్త‌గా క‌నిపించ‌బోతున్నార‌ట‌. దీని కోసం విదేశీ ట్రైన‌ర్ ద‌గ్గ‌ర మ‌హేష్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ ట్రైన‌ర్ ఎవ‌రో కాదు.. లాయిడ్ స్టీవెన్స్ (Lioyd Stevens). ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు.. స‌ద‌రు ట్రైన‌రే. లాయిడ్ స్టీవెన్స్ (Lloyd Stevens) మ‌హేష్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడా ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇంతకు ముందు లాయిడ్స్ .. ఎన్టీఆర్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ట్రైనర్‌గా వర్క్ చేశారు. అల వైకుంఠ‌పుర‌ము (Ala Vaikunthapurramuloo)లో చిత్రం త‌ర్వాత త్రివిక్ర‌మ్ (Trivikram) డైరెక్ట్ చేయ‌నున్న చిత్ర‌మిది. మ‌ధ్య‌లో గురూజీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా చేసిన భీమ్లా నాయ‌క్ (Bheemla Nayak) సినిమాకు రైట‌ర్‌గా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే.

అత‌డు (Athadu), ఖ‌లేజా (Khaleja) సినిమాల త‌ర్వాత మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా న‌టిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ కోసం పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి సినిమా చేస్తున్నారు.

View this post on Instagram A post shared by Lloyd Stevens (@lloydstevenspt)
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.