యాప్నగరం

‘అన్నాత్తై’ షూటింగులో కరోనా కలకలం.. క్వారంటైన్లో రజినీకాంత్

రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అన్నాత్తై’ సినిమా షూటింగులో కరోనా కలకలం రేపింది. నలుగురు యూనిట్ సభ్యులకు కరోనా రావడంతో షూటింగ్ నిలిపేశారు.

Samayam Telugu 25 Dec 2020, 7:24 am
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘అన్నాత్తై’ సినిమాను కరోనా వైరస్ కలవరపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్‌లో ఏకంగా నలుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటించిది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్.
Samayam Telugu రజినీకాంత్


యూనిట్ సభ్యులకు సాధారణ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ అని తేలిందని, అయితే రజినీకాంత్‌కు ఇతర సిబ్బందికి మాత్రం నెగిటివ్ వచ్చిందని సన్ పిక్సర్స్ తెలిపింది. అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు రజినీకాంత్ హైదరాబాద్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ నెల 31 రజినీకాంత్ తన రాజకీయ పార్టీ ప్రకటిస్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

దీనిపై ఆయన సోదరుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 27 లేదా 28వ తేదీల్లో రజినీకాంత్ చెన్నై తిరిగి వస్తారని, 31న రాజకీయ పార్టీ ప్రకటించడం ఖాయమని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.