యాప్నగరం

Hyderabad లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ.. అభిమానులకి పాస్‌లు

Mahesh Babu ఈరోజు హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ ఏర్పాట్లని చేశారు. దాదాపు ఐదు వేల మందికి భోజనం ఏర్పాట్లని కూడా మహేష్ బాబు చేసినట్లు తెలుస్తోంది. అలానే సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లని చేశారట. ఈ నెల 15న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ చనిపోయారు. ఆ తర్వాత అస్థికల్ని కృష్ణ నదిలో నిమజ్జనం చేసిన మహేష్ బాబు.. ఎమోషనల్‌గా...?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 27 Nov 2022, 2:09 pm

ప్రధానాంశాలు:

  • ఈరోజు హైదరాబాద్‌లో కృష్ణ పెద్ద కర్మ
  • అన్ని ఏర్పాట్లనీ చేసిన మహేష్ బాబు
  • దాదాపు 5 వేల మందికి భోజన ఏర్పాట్లు
  • ఈ నెల 15న చనిపోయిన కృష్ణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Superstar Krishna Pedda Karma
కృష్ణ పెద్ద కర్మకి హైదరాబాద్‌లో ఏర్పాట్లు
సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) పెద్ద కర్మ ఈరోజు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నెల 15న కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అనంతరం అస్థికల్ని మహేష్‌ బాబు (Mahesh Babu) కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ (Superstar Krishna Pedda Karma)కి అన్ని ఏర్పాట్లనీ చేసిన మహేష్ బాబు.. దాదాపు 5 వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ నెల 16న హైదరాబాద్‌కి వచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద కర్మకి కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దాంతో.. జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అభిమానులకి భోజనం ఏర్పాట్లని చేసిన మహేష్ బాబు.. రాజకీయ, సినీ ప్రముఖుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌ ఏర్పాట్లని చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే దాదాపు 5 వేల పాస్‌లని అభిమానులకి అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఎన్‌ కన్వెన్షన్‌ వద్ద సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారట. పాతికేళ్ల వయసులో కృష్ణ ఎలా ఉండేవారో.. అచ్చం అలానే ఆ విగ్రహాన్ని రూపొందించినట్లు ఓ టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి మహేష్ బాబు ఈ ఏడాది వరుసగా ముగ్గురిని కోల్పోయారు. సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిర, ఇటీవల తండ్రి కృష్ణ చనిపోవడం మహేష్ బాబుకి తీరని లోటు. దాంతో సూపర్ స్టార్ కృష్ణ అస్థికల్ని నిమజ్జనం చేసిన తర్వాత మహేష్ బాబు ఎమోషనల్‌గా ఒక ట్వీట్ కూడా చేశాడు. కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తానని అందులో రాసుకొచ్చాడు.


రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.