యాప్నగరం

విజయ్ దేవరకొండకు మహేష్‌బాబు సాయం

కింగ్ ఆఫ్ ది హిల్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్లపై వర్థన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. షమీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తరుణ్ భాస్కర్ హీరో.

Samayam Telugu 15 Oct 2019, 10:21 pm
Samayam Telugu Mahesh_Vijay
మహేష్ బాబు, విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘నేను మాత్రమే చెప్తా’ అనే సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ‘పెళ్ళి చూపులు’తో తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే షమీర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నారు. అవంతికా మిశ్రా హీరోయిన్. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

Also Read: రామోజీరావును కలిసిన మోహన్‌బాబు.. ఆ రూమర్లకు చెక్

ఈ సినిమాను నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా రేపు (అక్టోబర్ 16న) ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు సోషల్ మీడియా ద్వారా ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్‌ను మహేష్ బాబు విడుదల చేయనున్నారు.

కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ నటన థియేటర్‌లో ప్రేక్షకుల కడుపులు చెక్కలు చేయడం ఖాయంలా కనిపిస్తోంది. ఇప్పటికే ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన ఈ యువ దర్శకుడు ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారట. టీజర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా రేపు రాబోయే ట్రైలర్‌తో అంచనాలను ఏమేర పెంచుతుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.