యాప్నగరం

నాడు మోదీ నేడు రజినీ.. షరతులు వర్తిస్తాయ్ అంటున్న అధికారులు

ఓసారి నరేంద్ర మోదీ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొని ప్రజలను సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ ప్రయోగం చేయబోతున్నారు.

Samayam Telugu 28 Jan 2020, 2:31 pm
సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభవార్త. త్వరలో ఆయన్ను అంతర్జాతీయ టీవీ ఛానెల్‌లో చూసే అవకాశం రాబోతోంది. అదెలా అంటారా.. త్వరలో రజినీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన అడ్వెంచరస్ షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో కనిపించబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీ ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ ప్రోగ్రామ్ షూట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం రజినీకాంత్ సోమవారమే బందిపూర్‌కి చేరుకున్నట్లు టైగర్ రిజర్వ్ డైరెక్టర్ బాలచంద్ర తెలిపారు.
Samayam Telugu rajinikanth
రజినీకాంత్


మంగళవారం రాత్రిలోగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోతారట. కేవలం అడవిలోకి కెమెరాలు మాత్రమే అనుమతించామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం 2019లోనే కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో బానిజే గ్రూప్, సెవెన్ టారస్ ఎంటర్‌టైన్మెంట్ స్టూడియో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ షో నేపథ్యంలో కర్ణాటక అటవీ శాఖ అధికారులు చాలా రూల్స్ పెట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఎలాంటి కార్యక్రమాలైనా షూట్ చేసుకోవచ్చు.

READ ALSO: ద్యావుడా ఇదేం డ్రెస్ ప్రియాంక? హీరోయిన్లూ.. మీకు వేసుకునే ధైర్యం ఉందా?

ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు జంతువులకు కానీ చెట్లకు కానీ ఎలాంటి హాని తలపెట్టకూడదు. విద్యుత్తు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు. లైట్లు, సౌండ్ మెటీరియల్స్, జెనరేటర్లు తీసుకెళ్లకూడదు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే స్పాట్‌లోనే కార్యక్రమాన్ని రద్దు చేస్తామని కాంట్రాక్ట్‌లో వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.