యాప్నగరం

డి. రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.. మిస్ యూ అంటూ వెంకటేష్ పోస్ట్

ఈ రోజు (ఫిబ్రవరి 18) టాలీవుడ్ నిర్మాత రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు సురేష్ బాబు, వెంకటేష్ ఘన నివాళి అర్పించారు.

Samayam Telugu 18 Feb 2021, 2:06 pm
నేడు (ఫిబ్రవరి 18) గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబు సహా పలువురు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుబెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భాషలలో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత మన రామానాయుడు. ఆయన వర్ధంతి సందర్భంగా ఫిల్మ్ నగర్‌లో రామానాయుడు విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి ఘనమైన నివాళి ఘటించారు.
Samayam Telugu డి. రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
D Ramanaidu


ఈ సందర్భంగా కాజా సత్య నారాయణ గారు మాట్లాడుతూ "ఈ రోజు ఫిల్మ్ నగర్ ఇలా ఉంది అంటే దానికి ముఖ్య కారణం రామానాయుడు గారే, అయన చేసిన సేవల వలన ఈరోజు మన ఫిల్మ్ నగర్‌లో ఇంతమందికి జీవనాధారం దొరికింది. అందుకే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు ప్రతిరోజు స్మరించుకుంటున్నాం'' అన్నారు.
రామ్ కొత్త సినిమాపై అఫీషియల్ స్టేట్‌మెంట్.. తమిళ దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్
ఇక తండ్రి రామానాయుడు చిత్రపటాన్ని షేర్ చేసిన విక్టరీ వెంకటేష్.. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ రోజును మరచిపోలేం. ఈ జ్ఞాపకాలను స్మరించుకుంటూనే ఉంటాము. లవ్ యూ అండ్ మిస్ యూ నాన్న'' అని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.