యాప్నగరం

ప్రముఖ హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నుమూత

నటుడు భౌతికంగా మనకు దూరమైనా, ఆయన పంచిన హాస్యం మనతో ఎప్పటికీ ఉంటుదని సినీ ఇండస్ట్రీ ఆయనకు తుది వీడ్కోలు పలికింది.

Samayam Telugu 6 Sep 2018, 1:09 pm
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ రాకెట్‌ రామనాథన్ (74) మరణం తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. తమిళంలో తొలితరం మిమిక్రీ ఆర్టిస్టుగా పేరుగాంచిన రామనాథన్ అనారోగ్య కారణాలతో మంగళవారం అర్ధరాత్రి తర్వాత సమయంలో కన్నుమూశారు. సీనియర్ నటుడి మృతిపట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దక్షిణ భారత నటీనటుల సంఘం సంతాపం వ్యక్తం చేస్తూ ఒక లేఖను మీడియాకు విడుదల చేసింది.
Samayam Telugu Rocket Ramanathan


ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్‌లాగా చక్కటి హావభావాలతో మిమిక్రీ చేయడంలో ఆయన దిట్ట. 1982లో స్పరిశం మూవీ ద్వారా కమెడియన్‌గా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఒరు పుల్లాంకుళల్‌ అడుప్పు ఊదుదు, వలత్తకడా, మన్‌సోరు, నామ్‌, వరం వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీతో మెప్పించారు. చిత్ర పరిశ్రమకు రామనాథన్ చేసిన సేవలకుగానూ తమిళనాడు ప్రభుత్వం కలైమణి అవార్డుతో సత్కరించింది. నడిగర్‌ సంఘం నుంచి కలై సెల్వం బిరుదును సైతం అందుకున్నారు. ఆయన చివరగా నటించిన చిత్రం ‘నందా’

రాకెట్‌ రామనాథన్‌కు భార్య భానుమతి, కుమారుడు గురు బాలాజీ, కూతురు సాయిబాల ఉన్నారు. ఈ సీనియర్ నటుడి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం కృష్ణాపేట శ్మశానవాటికలో నిర్వహించారు. రామనాథన్ భౌతికంగా మనకు దూరమైన ఆయన పంచిన హాస్యం మనతో ఎప్పటికీ ఉంటుదన్నారు చిన్ని జయంత్. రామనాథన్ తనకు ఎన్నో అవకాశాలు ఇప్పించారని నటుడు రోబో శంకర్ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.