యాప్నగరం

కుక్కలే విశ్వాసంగా ఉంటాయి.. రజినీకాంత్‌ని టార్గెట్ చేసిన నిర్మాత

సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ తమిళ నిర్మాత కే రాజన్. కే బాలచందర్ వర్థంతి సందర్భంగా రాజన్ ప్రసంగిస్తూ పరోక్షంగా రజినీ, కమల్ హాసన్‌పై కామెంట్స్ చేశారు.

Samayam Telugu 25 Dec 2019, 12:09 pm
లెజండరీ దర్శకుడు కే. బాలచందర్ ఎందరికో జీవితాన్ని ఇచ్చారు. ఈరోజు రజినీకాంత్, కమల్ హాసన్ సూపర్‌స్టార్స్‌గా పేరు తెచ్చుకుని చిత్రపరిశ్రమను ఏలుతున్నారంటే అందుకు బాలచందరే కారణం. అలాంటిది నిన్న బాలచందర్ వర్థంతి సందర్భంగా చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహిస్తే కమల్, రజినీ వెళ్లకపోవడం గమనార్హం. చెన్నైలోని కుమారరాజా ముత్తయ్య హాల్‌లో బాలచందర్ పేరిట అభిమానులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కే రాజన్, మాజీ మేయర్ సైదై దురైసామి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజన్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ.. రజినీకాంత్‌ను టార్గెట్ చేశారు.
Samayam Telugu rajinikanth k rajan
రజినీకాంత్ కే రాజన్


READ ALSO: Prati Roju Pandageపై బన్నీ కామెంట్.. సెల్ఫ్ డబ్బా అంటున్న నెటిజన్స్

‘‘చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలచందర్‌ను స్ఫూర్తిగా తీసుకుని దర్శకులుగా ఎదిగినవారు ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేశాకే టాప్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎందరో నటులకు కూడా ఆయన జీవితాన్ని ఇచ్చారు. అలాంటిది ఆయన వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వేడుకలకు కేవలం కొందరు ప్రముఖులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. కుక్కలే విశ్వాసంగా ఉంటాయి అన్నట్లు.. బాలచందర్‌తో కలిసి పనిచేసిన వారికి అభిమానులు ఎక్కువ. వారే ఫ్యాన్స్ క్లబ్ ఏర్పాటుచేస్తున్నారు. తమిళ సినిమాకు జీవం పోసింది బాలచందరే. ఎందరో నటీనటులకు అవకాశాలు ఇచ్చారు. అంత గొప్ప దర్శకుడి కుటుంబం ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉంది. వారు అలా కష్టపడకూడదు. బాలచందర్ కుటుంబానికి సాయం చేయాలంటే ఆయనకు చెందిన నిర్మాణ సంస్థతో కలిసి రజినీకాంత్ ఓ సినిమా చేయాలి. త్వరలో ఆయన సినిమా చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని తెలిపారు.

READ ALSO: అనసూయకు జీఎస్టీ అధికారుల నోటీసులు.. 55 లక్షలు కట్టాలట

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.