Tammareddy Request To Chiru; Start A New Maa Committee With Responsible People
Chiranjeevi ‘మా’ కిరికిరి: పరువు తీసినోళ్లను పీకేసి.. ‘చిరు’ కొత్త కమిటీ: తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య విభేదాలు డైరీ ఆవిష్కరణ సందర్భంగా బట్టబయలైనాయి. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్ లాంటి ‘మా’ పెద్దల సాక్షిగా మైక్ అందుకుని ‘మా’ గుట్టుని బట్టబయలు చేసి ఏకిపారేశారు హీరో రాజశేఖర్. అయితే ఈ రచ్చపై మెగాస్టార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. ఈ ఇష్యూలో బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు చిరంజీవి.
Samayam Telugu9 Jan 2020, 4:27 pm
ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య విభేదాలు డైరీ ఆవిష్కరణ సందర్భంగా బట్టబయలైనాయి. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్ లాంటి ‘మా’ పెద్దల సాక్షిగా మైక్ అందుకుని ‘మా’ గుట్టుని బట్టబయలు చేసి ఏకిపారేశారు హీరో రాజశేఖర్. అయితే ఈ రచ్చపై మెగాస్టార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. ఈ ఇష్యూలో బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు చిరంజీవి.
తమ్మారెడ్డి కీలక సూచనలు..
ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఉన్న ‘మా’ ఇష్యూపై సీనియర్ దర్శక, నిర్మాత, ‘మా’ సీనియర్ సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి కీలక సూచనలు చేశారు తమ్మారెడ్డి. ఆయన మాట్లాడుతూ..
‘మా’.. టీ కప్పులో తుఫాన్
ఈ మధ్యన మా డైరీ ఆవిష్కరణ చేశారు.. చిరంజీవి, మోహన్ బాబు, క్రిష్ణంరాజు, సుబ్బిరామిరెడ్డి, మురళీమోహన్, జయసుధ లాంటి ప్రముఖలతో పాటు ‘మా’ కమిటీ సభ్యులు కూడా సంతోషంగా కార్యక్రమాన్ని జరిపించారు. అయితే సడెన్గా రాజశేఖర్ గారు.. వచ్చి మాట్లాడటంతో టీ కప్పులో తుఫాన్లా మంచిగా జరుగుతున్న కార్యక్రమం హడావిడైపోయింది.
దీనికి వెనుకున్న కారణం ఏంటంటే.
చిరంజీవి గారు అంతకు ముందు మాట్లాడుతూ.. ‘మా’లో తప్పులేం జరగలేదు.. అనసవరంగా అల్లరైపోయాం.. ఇప్పుడు అంతా కలిసి పనిచేయాలని అని ఆయన ఉద్దేశం చెప్పారు. ఆయన చాలా వరకూ అందర్నీ బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్గానే చెప్పారు. అయితే రాజశేఖర్ వాదన మరోలా ఉంది.. చిరంజీవి గారు చెప్పినట్టు తప్పులు జరగకపోతే మేం గెలిచేవాళ్లం కాదని.. తప్పులు జరిగాయనే చెప్పి మేం గెలిచాం. అలాంటప్పుడు మేం అబద్ధం ఆడి గెలిచినట్టు కదా.. అని ప్రశ్న లేవనెత్తారు. మేం అబద్ధం ఆడి గెలిస్తే.. ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు కదా అన్నారు.
నరేష్.. అప్పుడలా.. ఇప్పుడిలా!
ఇక మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. ‘కళ్యాణ లక్ష్మి’ చేస్తున్నాం.. పెన్షన్లు ఇస్తున్నాం అన్నారు. ఇవి కమిటీకి తెలియదు అన్నారు . ఇదే నరేష్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు.. సెక్రటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంతా ఆయన చేతుల మీదుగా జరగాలన్నారు. అదే కరెక్ట్ అయితే.. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న జీవిత చేతుల మీదుగా జరిగాలి కదా. వీళ్లకు తెలియకుండా నరేష్ ఒక్కరే వీళ్లెవరకీ తెలియకుండా ఎందుకు చేశారు. నిజంగానే కమిటీకి తెలిసి జరిగిందా? తెలియక జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది.
తప్పు జరగలేదని చిరంజీవి చెప్తున్నారు.. జీవితపై యాక్షన్ తీసుకోండి మరి!
‘మా’లో ఫ్రాడ్ జరిగిందా? లేదా? అన్నదానికి సమాధానం కావాలి. జరగలేదని చిరంజీవి గారు చెప్పారు.. అది నిజమైతే ఫ్రాడ్ జరిగిందని మా పరువును బజారును పెట్టిన వాళ్లని ఎందుకు వదిలిపెడుతున్నారు. లేదంటే.. జీవిత గారే అబద్ధం ఆడుతున్నారా? ‘మా’లో జరిగే విషయాలు జీవితకు తెలిసే తెలియనట్టుగా చెప్తుంటే ఆవిడపై యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు.
ఇలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తున్నవారు ఎవరైనా ఉంటే.. వాళ్లు ఎవరైనా సరే ‘మా’ పరువుని రోడ్డు మీదకి లాగిన బ్యాచ్ మొత్తాన్ని సస్పెండ్ చేసి.. నా ఉద్దేశంలో ప్రస్తుతం ఉన్న ‘మా’ కమిటీని సస్పెండ్ చేసి చిరంజీవి గారు నేతృత్వం వహించాలి.
ఎన్నికలు వద్దు.. చిరంజీవి అన్నీ తానై కొత్త కమిటీ
చిరంజీవి గారు ‘సైరా’ సినిమాకంటే కూడా ఎక్కువ డేట్లు ‘మా’ పంచాయితీలకు ఇచ్చారు. ఆయన ఇలాంటి పంచాయితీలను వదిలేసి.. ‘మా’ను అభివృద్ధి చేయాలనే ఆయన ఆలోచలను ఆచరణలో పెట్టాలి. చిరంజీవి గారు ‘మా’ను డెవలప్ చేయాలనే ఆలోచనల్లో ఉన్నారు. కాబట్టి మీ ఆలోచనలకు సరిపోయే వాళ్లను కమిటీగా వేసుకుని ఓ రెండు మూడేళ్లు ఎన్నికలు లేకుండా మీరు అనుకున్న పనులను సాధించి.. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్లని, పదవుల కోసం కొట్టుకునే వాళ్లను పక్కకు తప్పించి ప్రక్షాళన చేయాలి.
‘మా’ అంటే ఇప్పుడు పెద్ద జోక్!
ఇంతకు ముందు మా అంటే అందరకీ గౌరవం ఉండేది. ఇప్పుడు ‘మా’ అంటే పెద్ద జోక్గా మారింది. ట్రోలింగ్కి పనికి వచ్చేట్టుగా మారింది. అందుకే వీటిపై సీరియస్ యాక్షన్ తీసుకుని ‘మా’కు పూర్వవైభవాన్ని తీసుకుని రావాలని కోరుతున్నా. గతంలో చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్ చేసినప్పుడు ఓ రెస్పెక్ట్ ఉండేది. క్రమేపీ అది పోయింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి పోయిన పరువు తిరిగి రావాలంటే చిరంజీవి గారు రన్ చేయాలనే నా ఆలోచన’ అంటూ కీలక సూచనలు తెలియజేశారు తమ్మారెడ్డి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.