టాలీవుడ్లో కొత్త ప్రొడక్షన్ కంపెనీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో నిర్మాణ సంస్థలు వచ్చాయి. కొన్ని స్థిరంగా నిలబడ్డాయి. కొన్ని మాయమైపోయాయి. అయితే ఈ మధ్య యార్లగడ్డ వెంకట రమణ నిర్మాణ సారథ్యంలో సాయిరాం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి చేతుల మీదుగా ఆ ప్రొడక్షన్ కంపెనీని లాంచ్ చేయించారు. ఈ సంస్థ నుంచి త్వరలోనే రెండు సినిమాలు అనౌన్స్ కాబోతున్నాయి. శ్రీపాల్ రెడ్డి, వీర అనే ఇద్దరు దర్శకులు దర్శకులుగా చేయబోతున్నారు. శ్రీ బీ ఎస్ వీ పద్మారెడ్డి సమర్పణ లో శ్రీమతి జి. లక్ష్మి రెడ్డి సహా నిర్మాతగా,సాంబశివరావు కామేపల్లి ఎక్సజిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా లకు సంబందించిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తామన్నారు.
నిర్మాత యార్లగడ్డ వెంకట రమణ మాట్లాడుతూ.. సాయిరాం ప్రొడక్షన్స్ సంస్థలో యువ దర్శకులతో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయాలనీ ప్లాన్ చేసామని తెలిపారు. మా మంచి కోరుకునే తనికెళ్ల భరణి గారి ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తున్నామని అన్నారు. త్వరలోనే మేము చేయబోయే సినిమాలను అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. ప్రేక్షకులకు మా సంస్థ నుంచి మంచి అందించడమే మా లక్ష్యమని అన్నారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. సాయిరాం ప్రొడక్షన్స్ ఇవాళ ఆవిర్భావం. ఒక మంచి రోజున ఈ నిర్మాణ సంస్థ మొదలవడం ఆనందంగా ఉందని అన్నారు. నిర్మాత పద్మారెడ్డి గారు చాలా ఏళ్లుగా తెలుసని, ఆయన సినిమా ఇండస్ట్రీలో ముప్పై ఏళ్లుగా ఉన్నారని పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణా రెడ్డి గారితో అయన పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ సాయిరాం ప్రొడక్షన్స్ను ఆరంభించారని అన్నారు. త్వరలోనే రెండు సినిమాలను చేయబోతున్నారని, ఈ రెండు సినిమాల స్క్రిప్ట్స్ చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు.
నిర్మాత యార్లగడ్డ వెంకట రమణ మాట్లాడుతూ.. సాయిరాం ప్రొడక్షన్స్ సంస్థలో యువ దర్శకులతో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయాలనీ ప్లాన్ చేసామని తెలిపారు. మా మంచి కోరుకునే తనికెళ్ల భరణి గారి ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తున్నామని అన్నారు. త్వరలోనే మేము చేయబోయే సినిమాలను అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. ప్రేక్షకులకు మా సంస్థ నుంచి మంచి అందించడమే మా లక్ష్యమని అన్నారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. సాయిరాం ప్రొడక్షన్స్ ఇవాళ ఆవిర్భావం. ఒక మంచి రోజున ఈ నిర్మాణ సంస్థ మొదలవడం ఆనందంగా ఉందని అన్నారు. నిర్మాత పద్మారెడ్డి గారు చాలా ఏళ్లుగా తెలుసని, ఆయన సినిమా ఇండస్ట్రీలో ముప్పై ఏళ్లుగా ఉన్నారని పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణా రెడ్డి గారితో అయన పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ సాయిరాం ప్రొడక్షన్స్ను ఆరంభించారని అన్నారు. త్వరలోనే రెండు సినిమాలను చేయబోతున్నారని, ఈ రెండు సినిమాల స్క్రిప్ట్స్ చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు.