యాప్నగరం

#MeToo: రాఖీ సావంత్‌పై తనుశ్రీ 10 కోట్ల దావా

తనుశ్రీకి పిచ్చి పట్టిందని, అందుకే పదేళ్ల తర్వాత నానా పటేకర్ లాంటి గొప్పనటుడిపై ఆరోపణలు చేస్తోందంటూ రాఖీ సావంత్ ఇటీవల మండిపడ్డారు.

Samayam Telugu 22 Oct 2018, 8:29 pm
బాలీవుడ్‌లో లైంగిక వేధింపులను బయటపెట్టి సంచలనం రేపిన నటి తనుశ్రీ దత్తా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నటి రాఖీ సావంత్‌పై 10 కోట్ల మేర సివిల్ అండ్ క్రిమినల్ సెక్షన్ల కింద పరువు నష్టం దావా వేశారు. #MeToo ఉద్యమంలో భాగంగా.. సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే 10ఏళ్ల తర్వాత కోమా నుంచి బయటకొచ్చిన తనుశ్రీ ఆరోపణలు చేస్తుందంటూ నానా పటేకర్‌కు నటి రాఖీ సావంత్ మద్దతు తెలిపారు.
Samayam Telugu Rakhi Sawant and Tanushree Dutta


తనుశ్రీ న్యాయవాది నితిన్ మీడియాతో మాట్లాడుతూ.. పరువునష్టం దావాపై సమాధానం చెప్పకపోతే, రాఖీ సావంత్ రెండేళ్ల జైలుశిక్షగానీ, లేక జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, 2008లో వచ్చిన ఓకే హార్న్ ప్లీజ్ అనే మూవీ షూటింగ్‌లో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అసభ్యంగా తాకడంతో పాటు దాడి చేసేందుకు మనుషులను పురమాయించి వేధించారని తనుశ్రీ ఫిర్యాదు చేశారు. అయితే అసోసియేషన్ తన ఫిర్యాదును సరిగా విచారించలేదని తనుశ్రీ ఆరోపించారు. పదేళ్ల తర్వాత నానా పటేకర్, గణేష్ ఆచార్య, మరో ఇద్దరిపై వేధింపుల కేసు నమోదైంది.

తనుశ్రీకి పిచ్చి పట్టిందని, అందుకే పదేళ్ల తర్వాత నానా పటేకర్ లాంటి గొప్పనటుడిపై ఆరోపణలు చేస్తోందంటూ రాఖీ సావంత్ ఇటీవల మండిపడ్డారు. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయిందని, ఆమెతో డబ్బులు లేని కారణంగా పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తోందంటూ తనుశ్రీపై రాఖీ ఎదురుదాడికి దిగడం వివాదాస్పదమైంది. కాగా, డ్రగ్స్ ప్రభావంతో తనుశ్రీతో వీలుకాదని భావించిన యూనిట్ తనతో ఆ పాట పూర్తిచేసిందని రాఖీ పలు విషయాలు బహిర్గతం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.