యాప్నగరం

విచారణకు వెళ్లే ముందు.. తరుణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా?

తనకు డ్రగ్స్ వ్యవహారంలో ఏం సంబంధం లేదని ఇది వరకే మీడియా ముందు

TNN 22 Jul 2017, 11:22 am
తనకు డ్రగ్స్ వ్యవహారంలో ఏం సంబంధం లేదని ఇది వరకే మీడియా ముందు తన వాదనను వినిపించాడు తరుణ్. సినీ అవకాశాలు లేక దాదాపు కనుమరుగు అయ్యే దశలో ఉన్న ఈ హీరోకూడా డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా శనివారం సిట్ ముందు హాజరయ్యాడు తరుణ్. తనకు ఒకప్పుడు ‘ఆన్’అనే పబ్ ఉండేదని, అది తన సొంతం కూడా కాదని, తను భాగస్వామిని మాత్రమే అని.. డ్రగ్స్ వ్యవహారంలో పబ్బుల పేర్లు వినిపించడంతో పరువు పోతుందని.. తను పబ్ నే అమ్ముకున్నానని తరుణ్ ఇది వరకూ చెప్పాడు.
Samayam Telugu tarun interrogation started
విచారణకు వెళ్లే ముందు.. తరుణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా?


మరి సిట్ ఎందుకు నోటీసులు జారీ చేసిందో, విచారణలో తరుణ్ ఏం చెబుతాడో.. చూడాలి. సిట్ ముందు హాజరయ్యేందుకు తండ్రితో కలిసి వచ్చాడు తరుణ్. ఇది వరకూ విచారణకు హాజరైన ఇతర సెలబ్రిటీల వెంట కూడా వారి వారి కుటుంబ సభ్యులు వచ్చారు. ఇప్పుడు తరుణ్ వెంట తండ్రి వచ్చాడు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సిట్ విచారణకు ఇంటి దగ్గర నుంచి బయల్దేరిన తరుణ్ మార్గమధ్యంలో గుడికి వెళ్లాడు. జూబ్లీహిల్స్ 12లోని తన ఇంటి నుంచి తండ్రితో కలిసి గుడికి వెళ్లి, అక్కడ నుంచి సిట్ ఆఫీసుకు బయల్దేరాడు. ఉదయాన్నే అక్కడకు చేరుకున్నాడు. తరుణ్ విచారణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ రోజు విచారణకు పలు పబ్ ల నిర్వాహకులు కూడా హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.