యాప్నగరం

Murali Mohan: కాంగ్రెస్-టీడీపీ కలయిక అక్రమ సంబంధం.. చంద్రబాబుది తప్పుడు నిర్ణయం: మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు

TDP Congress Alliance: ముందస్తు ఎన్నికలు.. అధికార పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో ఇదీ ఒకటి. సంక్షేమ పథకాలతోనో.. అద్భుత పాలనతోనో ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నప్పుడు ఆ పాజిటివిటీని ఓటు బ్యాంక్‌గా మార్చుకుని ముందుస్తు ఎన్నికలకు వెళ్తుంటారు. పాలనపై ఎంతో నమ్మకం.. ప్రజలపై విశ్వాసం ఉంటే కానీ ఈ డేరింగ్ నిర్ణయం తీసుకోలేరు. కానీ చంద్రబాబు సింపథితో ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. బొక్కబోర్లా పడ్డా విషయాన్ని బహిర్గతం చేశారు టీడీపీ సీనియర్ నేత.. సినీ నటుడు మురళీ మోహన్.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 6 Jul 2022, 8:10 am
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా మురళీ మోహన్‌కి క్లీన్ ఇమేజ్ ఉంది. వందలాది చిత్రాల్లో నటించి.. నిర్మాతగా కూడా విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. బాగా ఆస్తి పరుడైన మురళీమోహన్‌ని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చారు చంద్రబాబు. సినిమాల్లో సక్సెఫుల్ హీరోగా పేరొందిన మురళీ మోహన్‌కి రాజకీయాల్లో మాత్రం తొలి అడుగు ఓటమితో ఎదురైంది. 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో అదే స్థానంలో అదే వ్యక్తిపై పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
Samayam Telugu Murali Mohan And Chandra Babu
చంద్రబాబు, మురళీ మోహన్


ఆ సందర్భంలో ఆయనపై అనేక రాజకీయ విమర్శలతో పాటు.. అవినీతి ఆరోపణలు వినిపించాయి. అయితే రాజకీయాల్లోకి రావడం ద్వారా ఇమేజ్‌తో పాటు.. డబ్బుని కూడా పోగొట్టుకున్నానని చెప్పిన మురళీ మోహన్ తన జీవితంలో చేసిన అది పెద్ద పొరపాటు చంద్రబాబు వల్లే చేశానని.. రాజకీయాల్లోకి రావడం తాను చేసిన బిగ్ మిస్టేక్ అని చెప్తూ.. చంద్రబాబు చేసి మిస్టేక్స్‌‌ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. అందులో మొదటిది కేసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఒకటైతే.. అరిపిరి ఘటన.

ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అలిపిరి ఘటనతో చంద్రబాబు (Chandra Babu Alipiri) గారికి విపరీతమైన సింపథీ వచ్చిన మాట వాస్తవం. దాంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. నాకు తెలిసి.. అధికారంలో ఉండి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ప్రతి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. చంద్రబాబు గారు కూడా అలాగే ఫెయిల్ అయ్యారు. అది చాలా కీలకమైన తప్పిదం. అలిపిర ఘటనతో విపరీతమైన సింపథీ వచ్చిన మాట వాస్తవం.. దాన్ని చూసుకుని ఇప్పుడు కనుక ఎన్నికలకు వెళ్తే ఏకగ్రీవంగా రిజల్ట్ ఉంటుందని అనుకున్నారు. తీరా ఓట్లు వేసే టైంకి జనం అలిపిర ఘటన (alipiri attack) మరిచిపోయారు.. సింపథీ మొత్తం పోయింది.. అధికారం కూడా పోయింది.

ఈ రెండే కాదు ఆ తరువాత జరిగిన ప్రత్యేక హోదా విషయంలో కూడా మిస్టేక్స్ చేశారు. ప్రత్యేక హోదా లేదని ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు.. దానికి ఓకే అనేశారు. బీజేపీతో చేతులు కలిపారు.. కానీ చివర్లో ప్యాకేజ్ లేదు.. హోదా కూడా ఇవ్వకపోవడంతో.. చంద్రబాబు గారు ఉన్న ఇద్దరు మినిస్టర్‌లతో రాజీనామా చేయించి.. పార్లమెంట్‌లో నిరసన చేయమనేవారు.. ఇవన్నీ చేయడం చాలా పొరపాటు.

ఇక కాంగ్రెస్‌తో దోస్తీ కూడా ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఎన్టీఆర్ గారు ఏ పార్టీపై పోరాడి అధికారంలోకి వచ్చారో.. తిరిగి అదే పార్టీతో చేతులు కలపడం పెద్ద బ్లండర్ మిస్టేక్. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుడితే.. అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలిపేసరికి అది అక్రమసంబంధంలా అయిపోయింది. ఇది రాజకీయాల్లో అక్రమ సంబంధం లాంటిది.. పరాకాష్ట.

అయితే ఇవన్నీ చంద్రబాబు గారు స్వలాభం కోసం చేసింది ఏమీ లేదు. పార్టీ నిలబడాలి.. ఎలక్షన్స్‌లో బ్రహ్మాడంగా గెలివాలి అన్న ఆలోచనతో చేసిన పొరపాట్లు తప్పితే.. దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకుని తిందాం అనే ఆలోచనతో కాదు. మనిషి అన్న తరువాత మిస్టేక్స్ చేస్తుంటారు. చంద్రబాబు గత ఐదేళ్ల పరిపాలనలో కూడా చాలా మిస్టేక్స్ చేశారంటూ మరికొన్ని ఉదహరించారు మురళీ మోహన్.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.