యాప్నగరం

పవన్‌కి అనుభవం లేదు.. జగన్‌కి జ్ఞానం లేదా?: సాధినేని యామిని

పవన్ కళ్యాణ్ పక్కన కూర్చుని మల్లెపూలు నలపడం తప్ప ఇంకేం చేయలేరంటూ సంచలన కామెంట్స్‌తో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు టీడీపీ మహిళా నాయకురాలు సాధినేని యామిని.

Samayam Telugu 6 Nov 2018, 7:01 pm
పవన్ కళ్యాణ్ పక్కన కూర్చుని మల్లెపూలు నలపడం తప్ప ఇంకేం చేయలేరంటూ సంచలన కామెంట్స్‌తో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు టీడీపీ మహిళా నాయకురాలు సాధినేని యామిని. అప్పటి నుండి టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా మారి ప్రభుత్వం తరుపున ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ ప్రతిపక్షపార్టీల ఆరోపణల్ని తిప్పికొడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాత్రలపైన, జగన్‌పై జరిగిన దాడి విషయంలోనూ తన వాయిస్‌ని వినిపించారు.
Samayam Telugu యామిని సాధినేని


ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆ మధ్య కాలంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌పైన, జగన్ పైన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు హోదా గురించి మాట్లాడలేదని అంటున్న పవన్ కళ్యాణ్ 2016 వరకూ ఏమయ్యారన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కేంద్రంపై అవిశ్వాసం పెట్టండని స్టేట్ మెంట్ ఇస్తేనే కాని.. అవిశ్వాసం పెట్టాలనే జ్ఞానం జగన్‌కి లేదా? పాపం పవన్ కళ్యాణ్ అయితే ఆయనకు అనుభవం లేదూ ఏమీ లేదు. ఆవేశంలో ఏదేదో మాట్లాడతారన్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ యామిని సాధినేని.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.