యాప్నగరం

పవన్ స్ఫూర్తితో తీసిన సినిమాలోని పాటను విడుదల చేస్తున్న చంద్రబాబు

ప్రముఖ దర్శకుడు వి.సముద్ర తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జై సేన’. ఈ సినిమాలోని పాటను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్నారు.

Samayam Telugu 7 Feb 2020, 9:13 pm
కావాలని చేస్తారో, అనుకోకుండా అలా జరుగుతాయో తెలీదు కానీ కొన్ని కొన్ని సంఘటనలు చాలా విడ్డూరంగా ఉంటాయి. ఇది కూడా అలాంటి సందర్భమే. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిర్మిస్తోన్న సినిమాలోని పాటను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏముందో మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బహుశా చిత్ర ప్రచారం కోసమే ఇలా చేస్తుండొచ్చు.
Samayam Telugu Pawan_Chandrababu
పవన్ కళ్యాణ్, చంద్రబాబు


శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న చిత్రం ‘జై సేన’. సీనియర్ దర్శకుడు వి.సముద్ర దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందించారు. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కిందటేడాది సెప్టెంబర్‌లో మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేశారు.

Also Read: కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ఫస్ట్ సాంగ్: తమన్ మెలోడీ అదిరింది

ఈ పాట చూస్తుంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ స్ఫూర్తితో ‘జై సేన’ సినిమా తీసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పవర్ స్టార్‌ను గుర్తుచేసేలా ఎర్రతుండు కూడా వాడారు. ఈ సాంగ్ టీజర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాలోని రెండో పాటను చంద్రబాబు నాయుడుతో విడుదల చేయిస్తున్నారు. రైతుల సమస్యలపై రూపొందించిన ఈ పాటను శనివారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఈ పాటను అభినయ శ్రీనివాస్ రచించగా రవి శంకర్ స్వరపరిచారు. కారుణ్య ఆలపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.