యాప్నగరం

హీరో గోపీచంద్ మళ్లీ తండ్రయ్యాడు..

తెలుగు హీరో గోపీచంద్ మళ్లీ తండ్రయారు. వినాయక చవితి రోజున ఆయన భార్య పండంటి బాబుకు జన్మనిచ్చారు.

Samayam Telugu 13 Sep 2018, 4:41 pm
హీరో గోపీచంద్‌ మళ్లీ తండ్రి అయ్యారు. ఆయన భార్య రేష్మా గురువారం ఉదయం 5.40 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో పండంటి బాబుకు జన్మనిచ్చారు. వినాయక చవితి రోజున తండ్రి అయ్యాయని గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మాకు మళ్లీ బాబు పుట్టాడు. వినాయక చవితి పండుగ రోజున ఇంతకంటే బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇంకేం ఉండదు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. గోపీచంద్‌, రేష్మ 2013 మే నెలలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి అబ్బాయి పుట్టాడు. అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు.
Samayam Telugu gopichand with wie


నటుడు శ్రీకాంత్ బంధువుల అమ్మాయి అయిన రేష్మా బీటెక్ చదివారు. త్రీడీ యానిమేషన్‌, విజువల్ ఎఫెక్ట్స్‌లపై ఆమె పట్టు సంపాదించారు.
గోపీచంద్ 8 ఏళ్ల వయసులోనే ఆయన తండ్రి కృష్ణ మరణించారు. చెన్నైలో చదువుకున్న ఆయన రష్యాలో ఇంజినీరింగ్ చదివారు. గోపీచంద్ అన్నయ్య ప్రేమ్ చంద్ ముత్యాల సుబ్బయ్య దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. సొంత బ్యానర్లో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. కానీ తర్వాత కారు ప్రమాదంలో ఆయన మృతిచెందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.