యాప్నగరం

సిట్‌తో నందు సిట్టింగ్ 3 గంటలే..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందు అలియాస్ ఆనంద్ ఆనంద్ కృష్ణ సిట్ విచారణ పూర్తైంది.

TNN 1 Aug 2017, 3:19 pm
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందు అలియాస్ ఆనంద్ ఆనంద్ కృష్ణ సిట్ విచారణ పూర్తైంది. సుమారు 3గంటల పాటు వివిధ కోణాల్లో ప్రశ్నలు అడిగిన అధికారులు కొంత సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ సిట్ విచారణకు హాజరైన ప్రముఖుల్లో అతి తక్కువ సమయం ప్రశ్నించింది నందునే. నిన్న విచారణకు హాజరైన తనీష్‌ని 4 గంటల సమయం విచారించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu telugu actor nandu sit investigation finished in drugs case
సిట్‌తో నందు సిట్టింగ్ 3 గంటలే..


ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ 1:30 గంటల వరకూ సాగింది. కెల్విన్, జీషాన్‌లతో గల సంబంధాలపై ఆరా తీశారు పోలీసులు. అయితే తనకు ఏవిధమైన చెడు అలవాట్లు లేవని అవసరమైతే తనకు ఎలాంటి టెస్ట్‌లు అయినా చేసుకోవచ్చని నందు సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం. మరి కెల్విన్ కాల్ లిస్ట్‌లో మీరు నంబర్ ఎలా వెళ్లింది అన్న ప్రశ్నకు మాత్రం సరైన ఆన్సర్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ఉదయం సిట్ కార్యాలయానికి వెళ్లేటప్పుడు నందు ఎంత ఫ్రీగా నవ్వుతూ వెళ్లారో.. వచ్చేటప్పుడు అలాగే ఉన్నారు. మరోవైపు నందు ఎక్సైజ్ కార్యాలయంలో అడుగుపెట్టడానికి ముందు అక్కడికి సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి గుడిలో పూజలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న 12 సెలబ్రిటీల విచారణ నేటితో ముగిసింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మొదలైన సిట్ సిట్టింగ్ నందుతో ముగిసింది. ఈ 12 మంది సెలబ్రిటీల విచారణ ఆధారంగా.. మరికొంత మందికి నోటీలసు అందించే పనిలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.