యాప్నగరం

ఏఎన్నార్ విలన్‌గా ఎందుకు నటించలేదో తెలుసా?

తెలుగులో తొలితరం హీరోల్లో ఒకరిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న అక్కినేని నాగేశ్వరరావు ఒక్క సినిమాలో కూడా ప్రతినాయకుడిగా కనిపించలేదు. అలా ఎందుకు జరిగిందో ఆయనే ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Samayam Telugu 5 Dec 2020, 2:07 pm
హీరోలుగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోల్లో చాలామంది విలన్‌ పాత్రల్లో కూడా మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మొదట్లో విలన్‌ పాత్రలు వేసి ఆ తర్వాత హీరో అయ్యారు. ఎన్టీఆర్, కాంతారావు, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు లాంటి ఎందరో నటులు హీరోలుగానే కాకుండా విలన్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే అగ్రహీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలిన అక్కినేని నాగేశ్వరరావు మాత్రం కెరీర్లో ఎప్పుడూ విలన్‌గా నటించలేదు.
Samayam Telugu అక్కినేని నాగేశ్వరరావు


Also Read: ‘తలైవి’గా కంగనా మ్యాజిక్.. వైరల్‌గా మారిన లేటెస్ట్ స్టిల్స్

అలా ఎందుకు జరిగిందో ఓ సందర్భంలో ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నా పర్సనాలిటీ(రూపం), కంఠం దుష్టపాత్రలకి సరిపోవు. ప్రేక్షకులు నన్ను విలన్‌గా అంగీకరించరనిపించింది. అందుకే ఎప్పుడూ విలన్ పాత్ర పోషించలేదు’ అని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. 1940లో ‘ధర్మపత్ని’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అక్కినేని నాగేశ్వరరావు సుమారు 250 సినిమాల్లో నటించారు. 2014లో వచ్చిన ‘మనం’ ఆయన ఆఖరి సినిమా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.