యాప్నగరం

సుశాంత్ అంత్యక్రియలకు వాళ్లెందుకు రాలేదు.. ప్రశ్నించిన పవన్ హీరోయిన్

సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరివల్లే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడాల్సిన వచ్చిందని పలువురు ప్రముఖులు ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 18 Jun 2020, 6:06 pm
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో నెపోటిజం ఎక్కువని విమర్శలు గుప్పిస్తున్నారు. కంగనా రనౌత్, తాప్సీ, శ్రద్ధాదాస్ వంటి హీరోయిన్లు ఇప్పటికే తమ గొంతు వినిపించారు. తాజాగా 'కొమురం పులి' చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటించిన నికీషా పటేల్ కూడా సుశాంత్ ఆత్మహత్యపై స్పందించింది. ముంబైలోని స్మశాన వాటికలో సుశాంత్ అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. అతని కుటుంబ సభ్యులు కొంత మంది సన్నిహితులు మాత్రమే ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులెవరూ హాజరుకాకపోవడంపై నికిషా పటేల్ విమర్శలు గుప్పించారు
Samayam Telugu సుశాంత్ సింగ్ రాజ్‌పుత్


సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు హజరుకాకపోవడాన్ని నికీషా తప్పుపట్టింది. అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు హాజరుకాలేదనేదే తన ప్రశ్న అని అంది. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా? అంటూ నికీషా మండిపడింది. బాలీవుడ్ లో మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించింది. సుశాంత్ స్టార్ వారసుడు కాదని... ఇలాంటి వారిని బాలీవుడ్ లో ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించింది. సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన వారెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదని నికీషా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మరోవైపు ఇవాళ సుశాంత్ అస్తికల్ని అతని కుటుంబ సభ్యులు పవిత్రా గంగానదిలో కలిపారు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.