యాప్నగరం

త్రివిక్రమ్ మరో తెలుగు నవలతో సినిమా!

ఇది వరకూ ‘అ ఆ’ సినిమాను ఒక తెలుగు నవల ఆధారంగా రూపొందించాడు దర్శకుడు త్రివిక్రమ్.

TNN 29 Jan 2018, 10:51 am
ఇది వరకూ ‘అ ఆ’ సినిమాను ఒక తెలుగు నవల ఆధారంగా రూపొందించాడు దర్శకుడు త్రివిక్రమ్. యద్ధనపూడి సులోచనరాణి రచించిన ‘మీనా’ నవల ఆధారంగా నితిన్, సమంతలతో త్రివిక్రమ్ ‘అ ఆ’ సినిమాను రూపొందించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే మీనా ఆధారంగా ‘అ ఆ’ ను రూపొందించినట్టుగా త్రివిక్రమ్ మొదట చెప్పలేదు. అ ఆ విడుదల అయిన తర్వాత కాపీ విమర్శలు రాగా.. యద్ధనపూడికి క్రెడిట్ ఇచ్చాడు ఈ దర్శకుడు. సినిమా టైటిల్ కార్డ్స్ లో సులోచనరాణి పేరు వేసి వివాదాన్ని పరిష్కరించుకున్నాడు.
Samayam Telugu thrivikram eye on madhubabu novels
త్రివిక్రమ్ మరో తెలుగు నవలతో సినిమా!


ఆ తర్వాత ఈ దర్శకుడు పవన్ కల్యాణ్ తో తీసిన అజ్ఙాత‌వాసి విషయంలో కూడా కాపీ వివాదం రేగింది. ఈ సినిమాను ఫ్రెంచి సినిమా ‘లార్గోవించ్’ నుంచి కాపీ చేసి తీశాడు ఈ దర్శకుడు. దానిపై కాపీ రైట్ వివాదం రాగా.. చివరికెలాగో దాన్ని పరిష్కరించుకున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఈ సారి ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట త్రివిక్రమ్. ఈ సారి అలాంటి వివాదాలు రాకుండా.. ముందుగానే హక్కులు కొనుక్కొంటున్నట్టుగా సమాచారం. ఈ సారి కూడా తన సినిమా కథ కోసం పాత నవలల మీద ఆధారపడుతున్నాడట ఈ దర్శకుడు. ఇప్పుడు మధుబాబు నవలల మీద కన్నేశాడట ఈ దర్శకరచయిత. ‘షాడో’ సీరిస్ లో బోలెడన్ని నవలలు రాశారు మధుబాబు. ఆయన రాసిన రెండు నవలల హక్కులను త్రివిక్రమ్ కొనుక్కొన్నట్టు సమాచారం. వాటిని ఆధారంగా చేసుకుని యాక్షన్ ఎంటర్ టైనర్లకు తగ్గ స్క్రిప్ట్స్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాడట ఈ రచయిత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.