యాప్నగరం

పేదలకు ఆహార పదార్థాలు అందించిన హీరో శ్రీకాంత్

అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ చౌహన్ మరియు పలువురు పోలీస్ సిబ్బందులతో కలసి యూసుఫ్ గూడలోని కృష్ణ కాంత్ పార్క్ ముందు ఆహార పదార్థాలు అందచేశారు శ్రీకాంత్ .

Samayam Telugu 15 Apr 2020, 3:22 pm
కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ పేదలకు సాయం చేసేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సామాన్య ప్రజలు సైతం.... పేదలకు ఆహారాన్ని నిత్యావసరాల్ని అంద చేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లు సైతం తమ వంతుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు.. సినీ కార్మికుల కోసం కూడా డొనేషన్ల అందించారు. తాజాగా సినీ నటుడు శ్రీకాంత్ పలువురికి ఆహార పదార్థాలు అందించారు. అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ చౌహన్ మరియు పలువురు పోలీస్ సిబ్బందులతో కలసి యూసుఫ్ గూడలోని కృష్ణ కాంత్ పార్క్ ముందు ఆహార పదార్థాలు అందచేశారు శ్రీకాంత్ .
Samayam Telugu srikanth


ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.... చిరంజీవి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న ఆర్టిస్ట్ వాళ్ళకి నిత్యవసర వస్తువులు అందజేశారని తెలిపారు. ఫిలిం ఇండస్ట్రీ లో పనిచేసే హీరోలు అందరూ తమకు తోచిన సహాయం చేస్తూనే ఉన్నారు. ఈరోజు డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ యూసఫ్ గూడ లో చాలామంది వలస కూలీలు తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారన్నారు. అందుకే పోలీసుల అనుమతితో పార్క వద్దకు వచ్చి తనకు తోచిన సాయం చేశారన్నారు. ఇలా సేవ చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. మనమందరం పోలీసులకు ఎంతగానో సహకరించాలని అన్నారు .అందరూ సామాజిక దూరాన్ని పాటించానలి శ్రీకాంత్ తెలిపారు. అందరూ ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారి ని తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు. ఈ విషయంలో మనకు పోలీసులు చేస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు శ్రీకాంత్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.