యాప్నగరం

‘మహానటి’ ఇలా మారిపోయిందేంటి.. తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్

మహానటి సినిమాతో భారీ క్రేజ్ దక్కించుకున్న కీర్తి సురేష్‌ తెలుగులో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా ఆమెకు సంబంధించిన లుక్ షాక్‌కు గురిచేస్తోంది.

Samayam Telugu 3 Oct 2020, 6:34 pm
‘నేను శైలజ’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన ఆమెకు అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ శిఖరస్థాయి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం అందుకుంది. ఆ క్రేజ్‌తో వరుసబెట్టి సినిమాలు చేయడంతో పాటు వాణిజ్య ప్రకనటనల్లోనూ సందడి చేస్తోంది. ఆమె నటించిన పెంగ్విన్ లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Samayam Telugu కీర్తి సురేష్


Also Read: ఆ మాత్రం దానికే క్రిమినల్‌గా చూస్తారా? చాలా బాధేస్తోంది.. హాట్ యాంకర్ ఆవేదన

అయితే ఎప్పుడూ బొద్దుగా కనిపించే కీర్తిసురేష్ ఇప్పుడు సన్నబడిపోయింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. ఒంటిమీద కేజీ కండ కూడా లేనట్లుగా మరీ సన్నగా కనిపిస్తోంది. దీంతో ఆమె నిజంగానే అలా మారిందా? లేక కెమెరా ట్రిక్‌తో అలా కనిపిస్తుందా? అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. ఎప్పుడూ బొద్దుగా ముద్దుగా కనిపించే తమ హీరోయిన్ ఇలా సన్నబడి లుక్ మొత్తం చెడగొట్టుకుందని పీలవుతున్నారు.
View this post on Instagram Tea is what warms my soul everyday, but you sure can’t take the Chennai out of me, there’s always love for a cup of coffee anyway. #InternationalCoffeeDay . . . #shootdiaries #coffeetime #coffeeday #breaktime #instashoot #shootlife #instalife #instagood #instamood A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on Oct 1, 2020 at 8:47am PDT

Also Read: ‘ఉప్పెన’ హీరోయిన్‌కు బంపరాఫర్.. క్రేజీ కాంబోలో ఛాన్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.