Tollywood Celebrities Sarvari Nama Ugadi Wishes To Telugu Audience
చేదు రుచి చూస్తున్నాం.. త్వరలోనే తీపి రుచి చూస్తాం: సెలబ్రిటీల ఉగాది శుభాకాంక్షలు
తెలుగు ప్రజలు ఇలాంటి ఉగాదిని ఎప్పుడూ జరుపుకోని ఉండి ఉండరు. ఈ పర్వదినం నుంచే తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారందరికీ ఇది ఏంతో ముఖ్యమైన పండుగ. ఉగాది అంటే మనకు గుర్తొకొచ్చేది షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణం. కానీ, ఈ ఉగాదికి మాత్రం ఆ రెండిటినీ చాలా మంది తెలుగు వారు మిస్సయ్యారు. దీనికి కారణం కరోనా మహమ్మారి. ఈ భయంకర వైరస్ను అరికట్టేందుకు దేశ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉగాది పచ్చడికి అవసరమయ్యే సరుకులను కూడా తెచ్చుకోలేని పరిస్థితి. అందుకే, ఈ ఉగాదికి చేదును రుచి చూస్తున్నాం అన్నారు టాలీవుడ్ హీరో సుధీర్ బాబు. ఆయనే కాదు.. ఈ ఉగాదికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కరోనానే ప్రస్తావించారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండి శార్వరి నామ సంవత్సరాదిని కుటుంబసభ్యులతో సరదాగా జరుపుకోవాలని, ఇదే మనం కరోనాపై చేసే పోరాటమని అన్నారు.
Samayam Telugu25 Mar 2020, 7:53 pm
తెలుగు ప్రజలు ఇలాంటి ఉగాదిని ఎప్పుడూ జరుపుకోని ఉండి ఉండరు. ఈ పర్వదినం నుంచే తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారందరికీ ఇది ఏంతో ముఖ్యమైన పండుగ. ఉగాది అంటే మనకు గుర్తొకొచ్చేది షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణం. కానీ, ఈ ఉగాదికి మాత్రం ఆ రెండిటినీ చాలా మంది తెలుగు వారు మిస్సయ్యారు. దీనికి కారణం కరోనా మహమ్మారి. ఈ భయంకర వైరస్ను అరికట్టేందుకు దేశ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉగాది పచ్చడికి అవసరమయ్యే సరుకులను కూడా తెచ్చుకోలేని పరిస్థితి. అందుకే, ఈ ఉగాదికి చేదును రుచి చూస్తున్నాం అన్నారు టాలీవుడ్ హీరో సుధీర్ బాబు. ఆయనే కాదు.. ఈ ఉగాదికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కరోనానే ప్రస్తావించారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండి శార్వరి నామ సంవత్సరాదిని కుటుంబసభ్యులతో సరదాగా జరుపుకోవాలని, ఇదే మనం కరోనాపై చేసే పోరాటమని అన్నారు.
త్వరలోనే తీపి రుచి చూస్తాం: సుధీర్ బాబు
‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకి గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి మనకిచ్చే మెసేజ్.. జీవితంలో తీపి ఉంటుంది. చేదు ఉంటుంది. ఈ కరోనా సమస్య మనకి చేదు రుచి చూపిస్తుంది. జీవితంలో ఇదో భాగం. త్వరలోనే తీపి రుచి చూస్తాం. ఆరోజులు మళ్లీ రావాలంటే అందరూ తప్పకుండా ఇంట్లోనే ఉండండి. అత్యవసరానికి తప్ప బయటకు రాకండి. ఈ సంవత్సరం ఉగాది ఇంట్లోనే అందరికీ ఆనందం, ఆరోగ్యం’ అని సుధీర్ బాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఒక వీడియోను ట్వీట్ చేశారు.
సుధీర్ బాబు ట్వీట్
కుటుంబాన్ని సురక్షితంగా ఉంచండి: కళ్యాణ్ రామ్
‘మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి నిశ్శబ్ద క్షణాన్ని ప్రార్థన కోసం ఉపయోగించండి. మీ కుటుంబం, స్నేహితుల గురించి ఆలోచించండి. మరీ ముఖ్యంగా చెబుతున్నాను.. లవ్ యు. శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు. అలాగే, కళ్యాణ్ రామ్ కూడా తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు మీ కుటుంబ సభ్యులకు శార్వారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాబోయే 21 రోజులు ఇంట్లోనే ఉండండి. కుటుంబసభ్యులకు సమయాన్ని కేటాయించండి. వాళ్లను సురక్షితంగా ఉంచండి’ అని కళ్యాణ్ రామ్ ట్వీట్లో పేర్కొన్నారు.
కళ్యాణ్ రామ్ ట్వీట్
అడివి శేష్ ట్వీట్
ప్రకృతిని కాపాడుకోండి: మోహన్ బాబు
డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రకృతిని కాపాడుకోండి, పెద్దల మాటను గౌరవించండి. మీ ఇంటిల్లిపాదికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఆ షిర్డీ సాయినాథుడిని కోరుకుంటున్నాను’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. అలాగే.. ‘మీకు మీ కుటుంబ సభ్యులకు శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితి ఉంది. మనం సంకల్పం, సహనం, పరిపక్వతతో వ్యవహరిస్తే విజయం సాధిస్తాం’ అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
మోహన్ బాబు ట్వీట్
మంచు విష్ణు ట్వీట్
బోలెడంత శక్తిని ఇవ్వాలి: కాజల్
స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజును మరాఠి, కొంకని ప్రజలు గుడి పడ్వా (మరాఠి నూతన సంవత్సరం)గా జరుపుకుంటారు. వాళ్లకు కూడా కాజల్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ ఉగాది, గుడి పడ్వా శుభాకాంక్షలు. ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఈ పండుగ మనకు బోలెడంత శక్తిని ఇవ్వాలి. ఇంట్లోనే ఉండండి, ఈరోజు వీలైనంత ఎక్కువ సమయం మీ కుటుంబంతో గడపండి’’ అని కాజల్ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ ఉగాది. ఈ దురదృష్టకర పరిస్థితుల్లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి పండుగను జరుపుకోలేమని నాకు తెలుసు. కానీ, ఆశలు వదులుకోవద్దు. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రతతోపాటు అన్ని జాగ్రత్తలను పాటించడం రాబోయే రోజుల్లో దేశం మొత్తం కలిసి ఓ పెద్ద పండుగను జరుపుకోవచ్చు’ అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.
కాజల్ ట్వీట్
రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్
నాగచైతన్య, వరుణ్ తేజ్ కూడా..
అక్కినేని నాగచైతన్య, వరుణ్ తేజ్తో పాటు రష్మిక మందన, ఈషా రెబ్బా కూడా తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంట్లోనే ఉంటూ భద్రంగా ఉండండి. మీ జాగ్రత్త మీరే తీసుకోవాలి. మన ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది.. రేపటి మంచి కోసం ఇది చాలా అవసరం. వారి సూచనలను క్రమశిక్షణతో పాటించడం ముఖ్యం. అందరూ దృఢంగా ఉండండి. దీన్ని మనం అంతం చేయగలం’’ అని నాగచైతన్య ట్వీట్ చేశారు. ‘‘ఈ ఉగాది మరింత కాంతివంతం కావాలి. మీకు, మీ కుటుంబసభ్యులకు బోలెడంత సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆస్తిని తెచ్చిపెట్టాలి. ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగను ఇంట్లోనే చేసుకుని మీకు మీరు భద్రంగా ఉండటం మరిచిపోకండి. అందరూ ఇళ్లలోనే భద్రంగా ఉండండి’’ అని వరుణ్ తేజ్ ట్వీట్లో పేర్కొన్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.