టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మెకు సైరన్ మోగింది. కార్మికుల వేతనాల పెంపుపై ఈ మేరకు సమ్మెను నిర్వహించబోతోన్నారు. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు నోటీసులు ఇచ్చారు. అసలే కరోనా వల్ల ఇండస్ట్రీ కుంటుపడింది. కలెక్షన్లు లేక సినిమా పరిశ్రమ వెలవెలబోతోంది. అయితే ఇదే సమయంలో కరోనా వల్ల కార్మికుల జీవితాలు అతలా కుతలం అయ్యాయి. ఇక పెద్ద పెద్ద సినిమాలు కూడా నిర్మాతలకు దెబ్బేస్తున్నాయి. ఇదంతా ఒక వైపుంటే.. కార్మికుల వేతనాల్లో మాత్రం ఎలాంటి మార్పలు రావడం లేదు. హీరోల రెమ్యూనరేషన్లకు మాత్రం రెక్కలొచ్చినట్టుగా ఎగిరిపోతోన్నాయి. కానీ కార్మికుల వేతనంలో మాత్రం వృద్ది కనిపించడం లేదు.
దీంతో గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచమంటూ నిర్మాతల మండలిపై ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఇక ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల అంశాన్ని సాగదీస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు వేతనాలు పెంచకుండా ఉన్నందుకు రేపటి (22 జూన్) నుంచి సమ్మె చేయనున్నట్టు సినీ ఇండస్ట్రీలోని 24 కీలక విభాగాల వాళ్లు ప్రకటించారు.
జీతాలు పెంచేవరకు సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ వారు షూటింగ్కు రాకూడదని ఫెడరేషన్ మీద ఒత్తిడి చేయడానికీ 24 యూనియన్ సభ్యులు ఈ బుధవారం ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడి చేయన్నట్టు ప్రకటించారు. వేతానాలు పెంచే వరకు 24 క్రాఫ్ట్స్ ఎవరు షూటింగ్లో పాల్గొనబోమని ఈ సందర్భంగా ప్రకటించారు.
మరి ఈ అంశం మీద ఫిల్మ్ ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కార్మికుల వేతన సమస్యను పరిష్కరించేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ అంశం చిరంజీవి దృష్టికి వెళ్తే పరిష్కారం వెంటనే లభిస్తుందని కార్మికులు భావిస్తున్నారని తెలుస్తోంది.
దీంతో గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచమంటూ నిర్మాతల మండలిపై ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఇక ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల అంశాన్ని సాగదీస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు వేతనాలు పెంచకుండా ఉన్నందుకు రేపటి (22 జూన్) నుంచి సమ్మె చేయనున్నట్టు సినీ ఇండస్ట్రీలోని 24 కీలక విభాగాల వాళ్లు ప్రకటించారు.
జీతాలు పెంచేవరకు సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ వారు షూటింగ్కు రాకూడదని ఫెడరేషన్ మీద ఒత్తిడి చేయడానికీ 24 యూనియన్ సభ్యులు ఈ బుధవారం ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడి చేయన్నట్టు ప్రకటించారు. వేతానాలు పెంచే వరకు 24 క్రాఫ్ట్స్ ఎవరు షూటింగ్లో పాల్గొనబోమని ఈ సందర్భంగా ప్రకటించారు.
మరి ఈ అంశం మీద ఫిల్మ్ ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కార్మికుల వేతన సమస్యను పరిష్కరించేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ అంశం చిరంజీవి దృష్టికి వెళ్తే పరిష్కారం వెంటనే లభిస్తుందని కార్మికులు భావిస్తున్నారని తెలుస్తోంది.