యాప్నగరం

బిగ్‌బాస్ పర్మిషన్...విచారణకు ముమైత్

డ్రగ్స్ దందాలో నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖుల్లో నటి ముమైత్‌ఖాన్ కూడా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బిగ్‌బాస్ రియాల్టీ షోలో పోటీదారుగా ఉన్నారు.

TNN 26 Jul 2017, 3:30 pm
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ ఐటంగర్ల్ ముమైత్ ఖాన్ రేపు సిట్ విచారణకు హాజరుకానుంది. తెలుగులో తొలిసారిగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో ముమైత్‌ఖాన్ ఓ కంటెస్టెంట్ అన్న సంగతి తెలిసిందే. ఈ నెల 27 న విచారణకు హాజరుకావాలని సిట్ జారీచేసిన నోటీసులో పేర్కోవడంతో హాజరయ్యేందుకు బిగ్ బాస్ అనుమతిచ్చారు. హిందీ బిగ్ బాస్ పదో సీజన్‌లోనూ కంటెస్టెంట్ స్వామి ఓం కూడా కోర్టు కేసులో విచారణకు హాజరుకావాల్సి ఉండగా అతడికి కూడా అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల విరామం అనంతరం స్వామి ఓం మళ్లీ బిగ్ బాస్ షోలో కొనసాగారు. ప్రస్తుతం ముమైత్ విషయంలోనూ అదే పునరావృతం కానుంది. బాస్ అనుమతి ఇవ్వడంతో రేపు ఉదయం 10 గంటలకు సిట్ ముందు ఆమె హాజరవుతారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలు వివరాలు సేకరించిన సిట్ అధికారులు ముమైత్‌ను అడగాల్సిన ప్రశ్నలపై ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. చార్మి తరహాలోనే ముమైత్‌ను కూడా మహిళా అధికారులు విచారించనున్నారు.
Samayam Telugu tollywood drug scandal big boss permition mumaith khan will attend tomorrow
బిగ్‌బాస్ పర్మిషన్...విచారణకు ముమైత్


మరోవైపు డ్రగ్స్ కేసులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ రెండుగా విడిపోయిందని అధికారులు పేర్కొన్నారు. విచారణకు హాజరవుతోన్న సినీ ప్రముఖులు వచ్చే ముందు కలబంద రసాన్ని తాగి కడుపు ఖాళీ చేసుకుని వస్తున్నారని వారు అంటున్నారు. ఎక్కువగా ఔషధాలు తీసుకున్నప్పుడు శరీరంలో చేరిన విషతుల్యాలు తొలగించడానికి కలబంద ఉత్పత్తులు సహాయపడతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తమనే ఎందుకు టార్గెట్ చేసుకున్నారని, చాలా రంగాల వాళ్లు ఇందులో ఉన్నారంటూ ఎదురుదాడి చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.