యాప్నగరం

పూరీకి డ్రగ్స్ చేరవేసింది శ్యామ్ కే నాయుడు!!

డ్రగ్స్ వ్యవహరంలో తన తండ్రిని అనవసరంగా లాగి, నానా యాగి చేస్తున్నారంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమార్తె ఇన్ స్టా గ్రాం ద్వారా చెప్పిన సుద్దులన్నీ అబద్దాలని తేలిపోయింది.

TNN 21 Jul 2017, 1:33 pm
డ్రగ్స్ వ్యవహరంలో తన తండ్రిని అనవసరంగా లాగి, నానా యాగి చేస్తున్నారంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమార్తె ఇన్ స్టా గ్రాం ద్వారా చెప్పిన సుద్దులు, అసలు తనకు సిగిరెట్ తాగే అలవాటే లేదు... ఇక డ్రగ్స్ అంటే ఏంటో కూడా రుచి తెలియదు, ఎలా ఉంటాయో ఎప్పుడూ చూడలేదంటూ మీడియా ముందు శ్యామ్ కే నాయుడు చెప్పిన శ్రీరంగనీతులన్నీ అబద్ధాలని తెలుస్తోంది. అసలు పూరీ జగన్నాథ్‌కు డ్రగ్స్ చేరవేసింది శ్యామ్ కే నాయుడేనని సిట్ అధికారులు అంటున్నారు. పూరీ తన ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా గంటల తరబడి ఛాట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు.
Samayam Telugu tollywood drugs scandal shyam k naidu is a peddler
పూరీకి డ్రగ్స్ చేరవేసింది శ్యామ్ కే నాయుడు!!


దీనిపై పూరీని అధికారులు ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని బుకాయించినా సిమ్‌తోపాటు ఛాట్ వివరాలను ముందుంచేసరికి అంగీకరించినట్టు సమాచారం. బ్యాంకాక్ నుంచి కెల్విన్ తో గంటల తరబడి పూరీ చాట్ చేయడమే కాదు, ఆ సిమ్ ద్వారా గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్టు, డ్రగ్స్ అమ్మకాలు సాగించినట్టు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ దందా మొత్తం బట్టబయలైనట్టు సమాచారం. అయితే విదేశాల నుంచి వచ్చే పార్సిల్స్‌ను పూరీకి అందించానే తప్ప, అందులో ఏముందో కూడా తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. డ్రగ్స్ వ్యవహారంపై సుబ్బరాజును కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ వినియోగంపై విచారణకు సినీ నటుడు సుబ్బరాజు నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందుగానే చేరుకున్నాడు. లాయర్, మరొక సన్నిహితుడితో కలిసి సుబ్బరాజు తన వాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.