యాప్నగరం

బెంగళూరు గంజాయి కేసు.. తెలుగు హీరోకి లింకు?

మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు మనవడు గీతా విష్ణు బెంగళూరులో చేసిన కారు యాక్సిడెంట్.. డ్రగ్స్ కేసుగా మారింది. గీతా విష్ణు, మరో ఇద్దరు శాండల్ వుడ్ నటులు

TNN 5 Oct 2017, 8:36 am
ఇటీవల.. మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు మనవడు గీతా విష్ణు బెంగళూరులో చేసిన కారు యాక్సిడెంట్.. డ్రగ్స్ కేసుగా మారింది. గీతా విష్ణు, మరో ఇద్దరు శాండల్ వుడ్ నటులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయ్యింది. అతి వేగమే ఆ యాక్సిడెంట్ కు కారణమని తేల్చిన పోలీసులు.. కారులోని వస్తువులను పరిశీలించి చూసి, గంజాయి ఉన్నట్టుగా కనుగొన్నారు. గీతా విష్ణు, శాండల్ వుడ్ నటులకు గంజాయి అలవాటు ఉందని, వారి దగ్గర గంజాయి స్టాకును కూడా పోలీసులు సీజ్ చేశారు.
Samayam Telugu tollywood hero supplied drugs to banglore
బెంగళూరు గంజాయి కేసు.. తెలుగు హీరోకి లింకు?


ఇలాంటి నేపథ్యంలో.. కర్ణాటక పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గంజాయి వారి చేతికి ఎలా వచ్చింది, డీలర్ ఎవరూ.. అనే అంశంపై పరిశోధన మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఒక తెలుగు హీరో పేరు వినిపిస్తోందని సమాచారం.

ఇటీవలే టాలీవుడ్ లో డ్రగ్స్ స్కాండల్ బయటపడిన సంగతి తెలిసిందే. కొంతమంది నటీనటులకు, దర్శకులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం, వారిని విచారించడం జరిగింది. అయితే వారందరినీ పోలీసులు బాధితులుగానే చూశారు. ఎవరి మీదా కేసులు నమోదు చేయలేదు. మరి ఇప్పుడు బెంగళూరులో గంజాయి తీగ లాగితే హైదరాబాద్ డొంక కదులుతోందని సమాచారం.

తమకు గంజాయి సరఫరా చేసింది, తరచుగా ఆ మాదకద్రవ్యాలను అందించేది ఒక తెలుగు హీరోనే అని ఆదికేశవువులు నాయుడు మనవుడు చెప్పాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే.. డ్రగ్స్ వ్యవహారంలో ఇటీవల సిట్ ముందుకు హాజరైన వారిలో ఒకరు.. అనే మాట వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.