యాప్నగరం

టాప్ టాలీవుడ్ న్యూస్: పవర్‌స్టార్ 'ఓజీ'పై అదిరిపోయే అప్‌డేట్.. కార్తికేయ 3 కోసం నిఖిల్ రెడీ

కొత్త మూవీ ప్రకటనలతో పాటు, టాప్ మూవీస్ నుంచి అదిరిపోయే అప్‌డేట్స్‌తో ఈరోజు టాలీవుడ్ కళకళలాడిపోతుంది. మరి ఏఏ సినిమాల నుంచి ఏం అప్‌డేట్స్ వచ్చాయో ఓ లుక్కేద్దాం. వాటితో పాటు ఇంట్రెస్టింగ్ న్యూస్‌ కూడా చూద్దాం.

Authored byఆర్ కే మురళీ కృష్ణ | Samayam Telugu 17 Mar 2024, 4:49 pm
ఆ వార్తలతో బాధపడ్డా: సమంత
Samayam Telugu tollywood latest news nikhil siddhartha confirms karthikeya 3 pawan kalyan og update
టాప్ టాలీవుడ్ న్యూస్: పవర్‌స్టార్ 'ఓజీ'పై అదిరిపోయే అప్‌డేట్.. కార్తికేయ 3 కోసం నిఖిల్ రెడీ

స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. "​కెరీర్‌లో భాగంగా ఎన్నో ప్రయోగాలు చేశాను. ఒక దశలో తీరిక లేకుండా సినిమాలు చేశాను. స్టార్ హీరోయిన్‌గా అగ్ర స్థానానికి చేరినా ఆ క్షణాల్ని అనారోగ్యం కారణంగా ఆస్వాదించలేకపోయా. నేను నటించిన సినిమాలకి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే నా ఆరోగ్య పరిస్థితిని వివరించాను. అంతే కానీ సానుభూతి కోసం కాదు. కానీ నేను సెంటిమెంట్ కోసమే ఇలా మాట్లాడనంటూ కొంతమంది వార్తలు రాశారు. అవి చూసి బాధేసింది." అంటూ సమంత చెప్పింది.

త్వరలోనే ఓజీ గ్లింప్స్

కార్తికేయ 3 అప్‌డేట్

View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

సందీప్ రెడ్డి Vs జావేద్ అక్తర్

'యానిమల్‌' మూవీ విషయంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా-బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సందీప్ రెడ్డికి జావేద్ మరో కౌంటర్ ఇచ్చారు. "ఆ సినిమా దర్శకుడిని నేను విమర్శించడం లేదు. మన దేశంలో నచ్చిన చిత్రాన్ని తీసే హక్కు ఎవరికైనా ఉంది. ఒక్కటి కాకపోతే మరో రెండు మూడు 'యానిమల్‌' సినిమాలు తీసుకోమనండి. నా బాధంతా ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకుల గురించే. 53 ఏళ్ల నా సినీ కెరీర్‌లో నేను ఎక్కడా అసభ్య సన్నివేశాలు, మాటలు రాయలేదు, చూపించలేదు. అందుకే ఆయన నా తనయుడు ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించిన 'మిర్జాపూర్‌' గురించి మాట్లాడుతున్నారు. అయితే అందులో ఫర్హాన్‌ యాక్ట్‌ చేయలేదు." అంటూ జావేద్ చెప్పారు.

ఆర్ఆర్ఆర్ కోసం జపాన్ నుంచి

విశాల్ కొత్త ప్రయాణం

మోహన్ లాల్ కొత్త సినిమా

​మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. 'L360' వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని తరుణ్ మూర్తి డైరెక్ట్ చేయబోతున్నారు. గతంలో ఆపరేషన్ జావా, సౌది వెళ్లాక వంటి సినిమాలను తరుణ్ డైరెక్ట్ చేశారు. వీళ్ల కాంబోపై మంచి అంచనాలు ఉన్నాయి.

నిఖిల్ కుమారుడి బారసాల

టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ ఈ మధ్యే తండ్రి అయ్యారు. నిఖిల్ భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా నిఖిల్‌ కుమారుడి రసాల వేడుకలు జరిగాయి. నిఖిల్‌-పల్లవి దంపతులు తమ కుమారుడికి కొత్త బట్టలు వేసి ఉయ్యాలలో వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రచయిత గురించి
ఆర్ కే మురళీ కృష్ణ
ఆర్‌కే మురళీ కృష్ణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.